ఎస్డి క్రియేషన్స్ ఇండియా బేనర్పై డాక్టర్ ఎస్.ఆర్. కుమార్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'క్రీస్తు ఏసు'. ఈ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 6న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. చిత్రం గురించి దర్శకుడు తెలియజేస్తూ... పరిశుద్ధ బైబిల్ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రమిది.
చరిత్రలో మైలురాయిలా నిలిచేవిధంగా రూపొందిస్తున్నాం. గుంటూరు, విజయవాడ, వైజాగ్ పరిసరప్రాంతాల్లో మొదటి షెడ్యూల్ పూర్తి చేశాం. రెండవ షెడ్యూల్లో భాగంగా ఫిలింసిటీ, రామకృష్ణ స్టూడియోలో చిత్రీకరణ కొనసాగుతోంది.
అనంతరం అమెరికా, జెరూసలెం తదితర ప్రాంతాల్లో కొనసాగే మూడో షెడ్యూల్లో చిత్రీకరణ పూర్తవుతుంది. నిర్మాణానంతర పనులు ముగించుకుని డిసెంబర్లో విడుదల చేయనున్నామని పేర్కొన్నారు.
ఈ చిత్రంలో టిఎస్ఆర్ లక్ష్మి, చంద్రశేఖర్ చండ్ర, ఎబి ఆనంద్, పాస్టర్ శ్యాంసన్, కత్రినా (లండన్), దీపా (ముంబై), కిరణ్ఖుమార్, జయరాజ్, చెరుకూరి సాంబశివరావు తదితరులు నటిస్తున్నారు.