Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను ఆ మాట చెప్పగానే దాసరి మీసం మెలేశారు... చిరంజీవి

దర్శకరత్న దాసరి నారాయణ రావు అనారోగ్యంతో కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఆయనను పరామర్శించేందుకు సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా వెళుతున్నారు. శుక్రవారం నాడు చిరంజీవి కూడా దాసరిని పరామర్శించేందుకు వెళ్లారు. ఐసీయులో వున్న దాసరి వద్దకు వ

Webdunia
శుక్రవారం, 3 ఫిబ్రవరి 2017 (19:25 IST)
దర్శకరత్న దాసరి నారాయణ రావు అనారోగ్యంతో కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఆయనను పరామర్శించేందుకు సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా వెళుతున్నారు. శుక్రవారం నాడు చిరంజీవి కూడా దాసరిని పరామర్శించేందుకు వెళ్లారు. ఐసీయులో వున్న దాసరి వద్దకు వెళ్లి పరామర్శించిన అనంతరం చిరంజీవి మీడియాతో మాట్లాడారు. 
 
తను వెళ్లగానే దాసరి తన ఖైదీ నెం. 150 చిత్రం వసూళ్ల గురించి అడిగారనీ, ఆ మాటను పేపరుపై రాసి ఇచ్చారన్నారు. తను రూ. 150 కోట్లు వసూలు చేసిందని చెప్పగానే మీసం మెలేశారనీ, ఇంకా రూ.250 కోట్లు వసూలు చేయాలని ఆయన ఆకాంక్షించినట్లు చెప్పారు. దాసరి చెప్పిన మాటలను నేను మర్చిపోలేనని అన్నారు. ఆయన ఒకట్రెండు రోజుల్లో కోలుకుంటారని, ఆయన వైద్యులు చేసే చికిత్సను మించి ఆత్మస్థైర్యం ఎక్కువనీ, తప్పకుండా త్వరగా కోలుకుని పూర్తి ఆరోగ్యంతో వస్తారని అన్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments