Webdunia - Bharat's app for daily news and videos

Install App

'సైరా' తర్వాత ఇద్దరు స్టార్ డైరెక్టర్లకు ఓకె చెప్పిన మెగాస్టార్

Webdunia
బుధవారం, 9 జనవరి 2019 (14:57 IST)
దాదాపు దశాబ్దకాలం తర్వాత సినీరంగ ప్రవేశం చేసిన నటుడు మెగాస్టార్ చిరంజీవి. ఆయన క్రియాశీలక రాజకీయాల తర్వాత చేసిన చిత్రం "ఖైదీ నంబర్ 150". ప్రస్తుతం 'సైరా' నరసింహా రెడ్డి చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ మరో రెండు నెలల్లో పూర్తికానుంది. వచ్చే దసరాకు ప్రేక్షకుల ముందుకురానుంది. 
 
ఈ నేపథ్యంలో చిరంజీవి మరో రెండు చిత్రాల్లో నటించనున్నారు. అందులో ఒకటి కొరటాల శివ, రెండోది మాటలమాంత్రికుడు త్రివిక్రమ్. ఇవి 152, 153 చిత్రాలుగా రూపుదిద్దుకోనున్నాయి. ముఖ్యంగా, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కే చిత్రం సందేశాత్మక చిత్రంగా ఉండనుంది. అలాగే, డీవీవీ దానయ్య నిర్మాత, చిరంజీవి హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది.
 
ఈ రెండు చిత్రాల్లో తొలుత కొరటాల శివ దర్శకత్వంలో చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. ఆ తర్వాత సినిమా త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఉంటుందని చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తాజాగా వెల్లడించారు. నిజానికి 'మిర్చి' చిత్రం తర్వాత కొరటాల శివతో చెర్రీ ఓ మూవీని తీయాలని భావిస్తున్నారు. కానీ, ఇప్పటివరకు సాధ్యపడలేదు. కానీ, చిరంజీవితో మాత్రం కుదిరింది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments