Webdunia - Bharat's app for daily news and videos

Install App

"ఉప్పెన'' యూనిట్ సభ్యులకు 'చిరు' కానుక ఖరీదు ఎంతో తెలుసా?

Webdunia
బుధవారం, 24 ఫిబ్రవరి 2021 (14:39 IST)
మెగా ఫ్యామిలీ హీరో వైష్ణవ్ తేజ్ - కృతిశెట్టి జంటగా నటించిన చిత్రం ఉప్పెన. బుచ్చిబాబు సాన దర్శకత్వం వహించగా, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ చిత్రం విడుదలైన తొలి ఆట నుంచి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ముఖ్యంగా. ఈ చిత్రం విజయం చిరంజీవికి ఎంతో ఆనందనిచ్చింది. అందుకే ఆయన ఉబ్బితబ్బిబ్బులైపోతున్నారు. చిత్ర దర్శకుడుతో యూనిట్ సభ్యులను పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. 
 
అంతటితో ఆగని చిరంజీవి తన సంతోషాన్ని 'ఉప్పెన' యూనిట్ సభ్యులతో పంచుకుంటున్నారు. కీలక సభ్యులకు బహుమతులు, అభినందన లేఖలు పంపించారు. స్పెయిన్‌కు చెందిన ప్రముఖ లగ్జరీ ఉత్పత్తుల సంస్థ 'లాడ్రో' విక్రయిస్తున్న 'ది థ్రిల్‌ ఆఫ్‌ లవ్‌ కపుల్‌ ఫిగరైన్' బొమ్మలను పంపించారు. 
 
సముద్రం ఒడ్డున మోకాళ్లపై కూర్చుని కళ్లలో కళ్లు పెట్టి చూసుకుంటునట్టున్న యువ జంట బొమ్మ ఖరీదు రూ.89 వేలట. నిర్మాణంలో భాగస్వామి అయిన ప్రముఖ దర్శకుడు సుకుమార్‌కు కూడా చిరంజీవి ఈ బహుమతి పంపారు. దీంతో తన ఆనందాన్ని సుకుమార్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. 'కొణిదెల చిరంజీవి, మద్రాసు, ఇండియా.. ఈ అడ్రస్‌కు చిన్నప్పుడు అమాయకంగా రాసిన లేఖలకు ఇప్పుడు ప్రతిలేఖ వచ్చినంత అనుభూతి..!' కలుగుతోంది అంటూ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments