Webdunia - Bharat's app for daily news and videos

Install App

Chiru; నయనతారతో మీసాల పిల్ల అంటూ సాంగ్ వేసుకున్న చిరంజీవి

చిత్రాసేన్
శుక్రవారం, 3 అక్టోబరు 2025 (10:41 IST)
Megastar Chiranjeevi, Nayanthara
మెగాస్టార్ చిరంజీవి తన అప్ కమింగ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ "మన శంకరవ ప్రసాద్ గారు" తో  ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. హిట్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నయనతార కథానాయిక. ఈ ప్రాజెక్ట్‌ను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్‌తో కలిసి గ్రాండ్ కాన్వాస్‌పై నిర్మిస్తున్నారు. శ్రీమతి అర్చన గర్వంగా సమర్పిస్తున్నారు.
 
దసరా సందర్భంగా మేకర్స్ ఫస్ట్ సింగిల్ 'మీసాల పిల్ల' ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ ఆల్బమ్‌ని స్పెషల్ కాన్సెప్ట్ డిజైన్‌ చేశారు. ప్రతి పాటకీ మెగాఅన్న ప్రిఫిక్స్ జోడించి  మెగా గ్రేస్, మెగా స్వాగ్,  మెగా మాస్ అంటూ క్యురియాసిటీ క్రియేట్ చేశారు. ఈ ఐడియా ఫ్యాన్స్, మ్యూజిక్ లవర్స్‌ని  ఆకట్టుకుంది.
 
ఈ ఏడాది సంక్రాంతికి సంక్రాంతి కి వస్తున్నాం ఆల్బమ్‌తో సంచలనం సృష్టించిన మ్యూజిక్ సెన్సేషన్ భీమ్స్ సిసిరోలియో, ఇప్పుడు మరోసారి పండుగ సందడి క్రియేట్ చేసే చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌తో రాబోతున్నారు.
 
ఈ ఉదయం రిలీజ్ చేసిన అనౌన్స్‌మెంట్ వీడియోలో అనిల్ రవిపూడి స్టైల్‌లోని సరదా టచ్, అలాగే లెజెండరీ సింగర్ ఉదిత్ నారాయణ్ పాడిన ఫస్ట్ సింగిల్ మీసాల పిల్లని పరిచయం చేశారు. వీడియోలోని క్విర్కీ ప్రెజెంటేషన్ నవ్వులు పంచి మ్యూజిక్ ఫీవర్‌కి స్టేజ్ రెడీ చేసింది.
 
మెగా గ్రేస్ ట్రాక్ ప్రోమోగా వచ్చిన మీసాల పిల్ల ఫ్రెష్‌గా, ఎనర్జిటిక్‌గా, ఫస్ట్ బాల్ కే సిక్స్ కొట్టినట్లుగా ఉంది. నాస్టాల్జియా, మెలొడీ, యూనివర్సల్ అపీల్‌ని కలిపిన ఈ సాంగ్ అందరికీ నచ్చే హిట్ ట్యూన్ అవ్వడం ఖాయం.  
 
ఈ చిత్రానికి సమీర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్‌గా, తమ్మిరాజు ఎడిటర్‌గా, ఎఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు.  ఎస్. కృష్ణ, జి. ఆది నారాయణ సహ రచయితలు. ఎస్. కృష్ణ ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా పనిచేస్తున్నారు.
వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం  2026లో సంక్రాంతి పండుగ సందర్భంగా థియేటర్లలోకి రానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పిన దక్షిణ మధ్య రైల్వే

ఉత్తరాంధ్రను వణికిస్తున్న వాయుగుండం... భారీ వర్షాలు... స్కూల్స్‌కు సెలవులు

నటి త్రిష, సీఎం స్టాలిన్ నివాసాలకు బాంబు బెదిరింపులు

Midhun Reddy: మిధున్ రెడ్డిని పట్టించుకోని వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి?

Nara Lokesh: కర్ణాటకపై నారా లోకేష్ దూకుడు విధానం.. ఈ పోటీ రాష్ట్రాలకు మేలు చేస్తుందిగా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

కాలేయ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు ఎలా వుంటాయి?

బాదం పప్పులు రోజుకి ఎన్ని తినాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఒక్క లవంగాను నోట్లో వేసుకుని నమిలితే...

తర్వాతి కథనం
Show comments