Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇల్లందులో ఆచార్య.. మెగాస్టార్ వెంట చెర్రీ.. ఫోటోలు వైరల్

Webdunia
సోమవారం, 8 మార్చి 2021 (11:56 IST)
Megastar Chiranjeevi
చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆచార్య' సినిమా చిత్రీకరణ సింగరేణి జేకే ఓపెన్‌ కాస్ట్‌లో ప్రారంభించారు. బొగ్గుట్టకు పుట్టినిల్లయిన ఇల్లందులో తొలిసారిగా మెగాస్టార్‌ చిరంజీవి అడుగుపెట్టారు. ఆదివారం ఇల్లెందు వచ్చిన మెగాస్టార్‌ చిరంజీవికి జీఎం పి.వి.సత్యనారాయణ, ప్రాజెక్టు అధికారి బొల్లం వెంకటేశ్వర్లు, ఎస్టేట్‌ అధికారి తౌరియా నాయక్‌ పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు.
 
పట్టణంలోని ఆర్‌ఆర్‌ కాలనీకి చెందిన 12 నుంచి 15 ఏండ్ల వయసున్న 30 మంది బాలురు, హైదరాబాద్‌ నుంచి 50 మంది మొత్తం 80 మంది ఓసీలో బాలకార్మికులుగా నటించడానికి సెలెక్ట్‌ చేశారు. వారం రోజుల పాటు ఈ షూటింగ్‌ జరగనుంది. బాలకార్మికులతో విలన్‌ సోనూసోద్‌ పనులు చేయిస్తుండటంతో మెగాస్టార్‌ చిరంజీవి, రాంచరణ్‌ ఫైటింగ్‌ సీన్‌ చిత్రీకరించనున్నట్టు తెలిసింది. 
 
ఉత్పత్తికి అంతరాయం కలుగకుండా ఈ సమయంలో ఓసీ బ్లాస్టింగ్‌ నిర్వహించినట్టు తెలిసింది. సాయంత్రం మరో సెషన్స్‌ షూటింగ్‌ తీశారు. షూటింగ్‌కు మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. షూటింగ్‌ ఓసీ లోపల ఎక్కడో నిర్వహిస్తున్నారు. బయట సీక్వెల్‌ వద్ద పోలీసులు, సినిమా సిబ్బంది మోహరించారు.

సంబంధిత వార్తలు

ఎమ్మెల్యే రాజాసింగ్‌ ముందస్తు అరెస్టు - విమానాశ్రయంలోనే అదుపులోకి తీసుకున్న పోలీసులు

దేవభూమి అనకనందా నదిలో పడిన మినీ బస్సు : 14 మంది మృతి

రుషికొండ ప్యాలెస్ రహస్యం గుట్టు రట్టు... రహస్యంగా విలాస భవనాలు కట్టారు: గంటా (Video)

ఆ రైల్వే డివిజన్ పరిధిలో నెల రోజుల పాటు అనేక రైళ్లు రద్దు!!

ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి మరో చేదు అనుభవం... ఫైలుపై సంతకం చేసేందుకు నిరాకరించిన మంత్రి!!

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments