Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య సురేఖతో కలిసి విదేశాలకు వెళ్లిన చిరంజీవి

Webdunia
మంగళవారం, 3 మే 2022 (14:51 IST)
ఇటీవల "ఆచార్య"గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఇపుడు తన భార్య సురేఖతో కలిసి విదేశాలకు వెళ్లారు. కరోనా మహమ్మారి తర్వాత ఆయన విదేశాలకు వెల్లడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ పర్యటనలో ఆయన అమెరికా, యూరప్ దేశాల్లో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. 
 
"పాండమిక్ తర్వాత తొలి ఇంటర్నేషనల్ జర్నీ. చిన్న హాలిడే తీసుకుని సురేఖతో కలిసి చాలా రోజుల తర్వాత యూఎస్, యూరప్‌లకు వెళుతున్నాం. త్వరలోనే అందరినీ కలుస్తాను" అంటూ కామెంట్స్ చేశారు. ఆ సందేశంతో పాటు సురేఖతో ఫ్లైట్‌లో కలిసివున్న ఫోటోను సైతం చిరంజీవి షేర్ చేశారు. 
 
ఈ పోస్ట్‌పై మెగా కోడలు ఉపాసన కొణిదెల స్పందించారు. హ్యాపీ టైమ్ అత్తయ్య మామయ్య అంటూ కామెంట్ చేశారు. ఇక చిరంజీవి ఫాలోయర్స్, అభిమానులు కూడా హ్యాపీ జర్నీ అంటూ విసెష్ చేశారు. కాగా, కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఆచార్య చిత్రం అనుకున్న స్థాయిలో విజయం దక్కలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ జెండాను పట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. మా మధ్య అవి లేవండి?

అన్నా ఒకసారి ముఖం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments