Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిబ్రవరి 4న వస్తున్న 'ఆచార్య' - క్లారిటీ ఇచ్చిన నిర్మాతలు

Webdunia
సోమవారం, 20 డిశెంబరు 2021 (07:46 IST)
మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రామ్ చరణ్ కాంబినేషన్‌లో కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "ఆచార్య". ఈ చిత్రాన్ని వచ్చే యేడాది ఫిబ్రవరి 4వ తేదీనే రిలీజ్ చేయాలని చిత్ర నిర్మాతలు నిర్ణయించి, ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. 
 
నిజానికి జనవరి 7వ తేదీన 'ఆర్ఆర్ఆర్' చిత్రం విడుదలవుతుంది. ఆ తర్వాత సంక్రాంతి రేస్‌లో 'భీమ్లా నాయక్', 'రాధేశ్యామ్', 'సర్కారువారిపాట' వంటి భారీ బడ్జెట్ చిత్రాలు ఉన్నాయి. దీంతో 'ఆచార్య' చిత్రాన్ని మరోమారు వాయిదావేయనున్నారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లుకొట్టాయి.
 
వీటిపై చిత్ర బృందం ఓ క్లారిటీ ఇచ్చింది. 'ముందుగా ప్రకటించినట్టుగా ఫిబ్రవరి 4వ తేదీన చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నాం. డబ్బింగ్ పనులు కూడా పూర్తయ్యాయి. అందరి అంచనాల్ని అందుకునేలా ఈ సినిమాను తీర్చిదిద్దాం' అని చిత్ర బృందం తెలిపింది. 
 
కాగా, ఈ చిత్రంలో చిరంజీవి ఆచార్యుడుగాను, నక్సలైట్‌గా రెండు విభిన్నమైన పాత్రలను పోషిస్తున్నారు. అలాగే, ఆచార్యకు అండదండలు అందించే పాత్రలో ఆయన తనయుడు రామ్ చరణ్ ఓ కీలకమైన సిద్ధ పాత్రలో కనిపించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మందలించిన తల్లి.. కత్తితో గొంతుకోసి చంపేసిన కిరాతక బీటెక్ కొడుకు

తమిళనాడుకు వర్ష సూచన - 12 జిల్లాల్లో కుండపోత వర్షం

పెళ్లి పేరుతో నమ్మంచి వాడుకుని వదిలేశాడు.. భరించలేక ప్రాణాలు తీసుకున్న యువతి

యువతిని తాకరాని చోట తాకిన అకతాయి.. దేహశుద్ధి చేసిన ప్రజలు

మటన్ కూరలో కారం ఎక్కువైందంటూ తిట్టిన భర్త... మనస్తాపంతో నవ వధువు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

తర్వాతి కథనం
Show comments