Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిబ్రవరి 4న వస్తున్న 'ఆచార్య' - క్లారిటీ ఇచ్చిన నిర్మాతలు

Webdunia
సోమవారం, 20 డిశెంబరు 2021 (07:46 IST)
మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రామ్ చరణ్ కాంబినేషన్‌లో కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "ఆచార్య". ఈ చిత్రాన్ని వచ్చే యేడాది ఫిబ్రవరి 4వ తేదీనే రిలీజ్ చేయాలని చిత్ర నిర్మాతలు నిర్ణయించి, ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. 
 
నిజానికి జనవరి 7వ తేదీన 'ఆర్ఆర్ఆర్' చిత్రం విడుదలవుతుంది. ఆ తర్వాత సంక్రాంతి రేస్‌లో 'భీమ్లా నాయక్', 'రాధేశ్యామ్', 'సర్కారువారిపాట' వంటి భారీ బడ్జెట్ చిత్రాలు ఉన్నాయి. దీంతో 'ఆచార్య' చిత్రాన్ని మరోమారు వాయిదావేయనున్నారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లుకొట్టాయి.
 
వీటిపై చిత్ర బృందం ఓ క్లారిటీ ఇచ్చింది. 'ముందుగా ప్రకటించినట్టుగా ఫిబ్రవరి 4వ తేదీన చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నాం. డబ్బింగ్ పనులు కూడా పూర్తయ్యాయి. అందరి అంచనాల్ని అందుకునేలా ఈ సినిమాను తీర్చిదిద్దాం' అని చిత్ర బృందం తెలిపింది. 
 
కాగా, ఈ చిత్రంలో చిరంజీవి ఆచార్యుడుగాను, నక్సలైట్‌గా రెండు విభిన్నమైన పాత్రలను పోషిస్తున్నారు. అలాగే, ఆచార్యకు అండదండలు అందించే పాత్రలో ఆయన తనయుడు రామ్ చరణ్ ఓ కీలకమైన సిద్ధ పాత్రలో కనిపించనున్నారు. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments