Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి బ్రహ్మాండంగా మాటలు చెబుతారు.. ప్చ్... రాజశేఖర్ ఫైర్

Webdunia
గురువారం, 2 జనవరి 2020 (15:46 IST)
తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఆధ్వర్యంలో మా డైరీ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఇందులో హీరోలు చిరంజీవి, మోహన్ బాబు, కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. అయితే, ఇందులో హీరో రాజశేఖర్ తీవ్ర ఆగ్రహంతో చిరంజీవిని టార్గెట్ చేశారు. ముఖ్యంగా, మూవీ సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడం, సఖ్యత లేని విషయం బహిర్గతమైంది. 
 
ఈ సమావేశంలో అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. చిరంజీవి మైక్ అందుకుని 'మా'లో ఏవైనా సమస్యలు ఉంటే మనలో మనమే చర్చించుకుందాం, మంచి ఉంటే అందరికీ వినిపించేలా చెబుదాం.. చెడు ఉంటే చెవిలో చెప్పుకుందాం అంటూ పిలుపునిచ్చారు. 
 
దీనిపై హీరో రాజశేఖర్ అభ్యంతరం వ్యక్తంచేశారు. చిరంజీవి తర్వాత రచయిత పరుచూరి గోపాలకృష్ణ మైక్ తీసుకుని మాట్లాడుతుండగానే, ఆయన నుంచి రాజశేఖర్ మైక్ లాక్కున్నంత పనిచేశారు. 
 
ఆపై తాను మాట్లాడుతూ, "కలిసి ఉందాం, కలిసి సాగుదాం అంటూ చిరంజీవిగారు బ్రహ్మాండంగా మాట్లాడారు. ఏవేవో చెబుతుంటారు కానీ, మాలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. నిప్పులేనిదే పొగరాదు, మనందరం హీరోలుగా యాక్ట్ చేస్తున్నాం, కానీ అదే హీరోలుగా రియల్ లైఫ్‌లో చేస్తుంటే అణచివేయాలని ప్రయత్నిస్తున్నారు" అంటూ నర్మగ్భ వ్యాఖ్యలు చేశారు. 
 
ఈ వ్యాఖ్యలకు అక్కడే ఉన్న మోహన్ బాబుకు చిర్రెత్తుకొచ్చింది. రాజశేఖర్ వ్యాఖ్యలకు అభ్యంతరం చెప్పే ప్రయత్నం చేయగా, "వినండి మోహన్ బాబు గారూ, మీరు అరిచేస్తే ఇది జరిగిపోదు" అంటూ మరింత మొండిగా వ్యవహరించారు. ఆ తర్వాత కూడా రాజశేఖర్ దూకుడుగానే మాట్లాడారు. 
 
దాంతో చిరంజీవి మైక్ తీసుకుని, "నేను చెప్పిందేమిటి, మీరు మాట్లాడుతున్నదేమిటి, నా మాటలకు ఏమైనా విలువ ఇచ్చారా? ఇష్టంలేని వాళ్లు ఇక్కడికి రావడం ఎందుకు?" అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో మళ్లీ రాజశేఖర్ జోక్యం చేసుకుని "ఇష్టం ఉంది కాబట్టే వచ్చాం, కాని వచ్చిన తర్వాత ఇలా జరిగింది" అంటూ అక్కడ్నించి నిష్క్రమించే ప్రయత్నం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆప్ఘనిస్థాన్‌లో భారీ భూకంపం - 600 మంది వరకు మృత్యువాత

ఆఫ్ఘనిస్తాన్‌లో భూకంపం: 622కి పెరిగిన మృతుల సంఖ్య, వెయ్యి మందికి గాయం

Chandrababu Naidu: సీఎంగా చంద్రబాబు 30 సంవత్సరాలు.. ఇంట్లో నాన్న-ఆఫీసులో బాస్ అని పిలుస్తాను

National Nutrition Week: జాతీయ పోషకాహార వారం.. ఇవి తీసుకుంటే?

ఇంటిలోని దుష్టశక్తులు పోయేందుకు మవనడిని నర బలిచ్చిన తాత...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments