Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రహ్మపుత్ర నదీజలాల సమాచారాన్ని పంచుకునేందుకు సై..

బ్రహ్మపుత్ర నదీజలాలకు సంబంధించిన డేటాను భారత్‌తో పంచుకునేందుకు చైనా సిద్ధమైంది. టిబెట్‌లో డేటా కలెక్షన్ స్టేషన్ అప్‌గ్రేడేషన్ పేరుతో భారత్‌తో ఆ డేటాను పంచుకోలేమంటూ గతేడాది చైనా తేల్చి చెప్పింది. అయితే

Webdunia
గురువారం, 29 మార్చి 2018 (11:25 IST)
బ్రహ్మపుత్ర నదీజలాలకు సంబంధించిన డేటాను భారత్‌తో పంచుకునేందుకు చైనా సిద్ధమైంది. టిబెట్‌లో డేటా కలెక్షన్ స్టేషన్ అప్‌గ్రేడేషన్ పేరుతో భారత్‌తో ఆ డేటాను పంచుకోలేమంటూ గతేడాది చైనా తేల్చి చెప్పింది. అయితే ప్రస్తుతం ఇరు దేశాలకు చెందిన అత్యున్నత స్థాయి అధికారులు జరిపిన చర్చలు ఫలించడంతో బ్రహ్మపుత్ర నదీజలాలకు సంబంధించిన డేటాను భారత్‌తో పంచుకునేందుకు సై అంటూ చైనా ప్రకటించింది.
 
వరదలను అంచనా వేసేందుకు అత్యంత అవసరమైన ఈ డేటాను పంచుకోవడాన్ని చైనా ఆపివేయడంతో అప్పట్లో భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ద్వైపాక్షిక సంబంధాలను మరింత మెరుగుపరుచుకునే దిశగా ఈ సమాచారాన్ని భారత్ పంచుకునేందుకు నిర్ణయించినట్లు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి లు కాంగ్ చెప్పారు. 
 
కాగా డోక్లామ్ ప్రాంతం గురించి భారత్- చైనాల మధ్య గతేడాది 73 రోజుల పాటు ఉద్రిక్తతలు చోటుచేసుకోవడంతో బ్రహ్మపుత్ర నదీ జలాల సమాచారాన్ని ఇచ్చేందుకు డ్రాగన్ నిరాకరించింది. అయితే, చైనాలోని హాంగ్‌ఝౌ నగరంలో భారత్-చైనా ఉన్నతస్థాయి అధికారులు జరిపిన చర్చలు సఫలమవడంతో.. నదీ జలాల సమాచారాన్ని పంచుకోనున్నట్టు చైనా ప్రకటించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వరద సహాయక చర్యలా.. నాకేం అధికారిక కేబినెట్ లేదు : కంగనా రనౌత్

గంజాయి రవాణాను ఇట్టే పసిగట్టేస్తున్న సరికొత్త టెక్నాలజీ...

డెత్ క్యాప్ పుట్టగొడుగుల పొడితో అతిథులను చంపేసింది...

విషపూరిత పుట్టగొడులను తినిపించి ముగ్గురిని హత్య చేసింది.. నాలుగో వ్యక్తిని కూడా?

PTM: మెగా పేరెంట్-టీచర్ మీటింగ్: 2,28,21,454 మంది పాల్గొనే ఛాన్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments