ఉపేంద్ర UI ది మూవీకి యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చిన సెన్సార్ బోర్డ్

డీవీ
బుధవారం, 11 డిశెంబరు 2024 (17:37 IST)
Upendra, Reeshma Nanaiah
కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర స్వీయ దర్శకత్వంలో ఫస్ట్ అఫ్ ఇట్స్ కైండ్ ఫిల్మ్ 'UI ది మూవీ' చిత్రంతో రాబోతున్నారు. లహరి ఫిల్మ్స్, జి మనోహరన్ & వీనస్ ఎంటర్‌టైనర్స్ కెపి శ్రీకాంత్ ఈ చిత్రాన్ని హై బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. నవీన్ మనోహరన్ సహా నిర్మాత. రీసెంట్ గా రిలీజ్ చేసిన వార్నర్ వీడియో ట్రెమండస్ రెస్పాన్స్ తో సినిమాపై హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేసింది. 
 
తాజాగా UI ది మూవీ సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకి యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. ఉపేంద్ర మిషన్ గన్ తో డైనమిక్ గా నిలుచున్న సెన్సార్ సర్టిఫికేట్ పోస్టర్ అదిరిపోయింది.  
 
గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ఈ చిత్రాన్ని తెలుగులో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. 
 
చాలా గ్యాప్ తర్వాత ఉపేంద్ర దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు వున్నాయి. లహరి ఫిల్మ్స్, వీనస్ ఎంటర్‌టైనర్స్ ఈ చిత్రాన్ని హై బడ్జెట్ తో నిర్మించారు. విజువల్ గా, టెక్నికల్ గా సినిమా అత్యున్నతంగా వుండబోతోంది. 
 
ఇప్పటివరకూ రిలీజ్ చేసిన ప్రతి ప్రమోషనల్ మెటిరియల్ సినిమాపై అంచనాలని పెంచింది. ట్రోల్, చీప్ సాంగ్స్ చార్ట్ బస్టర్ హిట్స్ అయ్యాయి. రీసెంట్ గా రిలీజైన వార్నర్ వీడియో నేషనల్ వైడ్ వైరల్ అయ్యింది.  
 
ఈ చిత్రంలో రీష్మా నానయ్య, మురళీ శర్మ, సన్నీలియోన్, నిధి సుబ్బయ్య, సాధు కోకిల, మురళీ కృష్ణ, ఇంద్రజిత్ లంకేష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
 
ఈ చిత్రానికి అజనీష్ బి లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. హెచ్‌సి వేణుగోపాల్ డీవోపీ కాగా, ఆర్ట్ డైరెక్షన్ శివ కుమార్ J (KGF1&2 ఫేమ్), VFX ని నిర్మల్ కుమార్ (విక్రాంత్ రోనా ఫేమ్) పర్యవేక్షిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీలో మిస్ ఫైర్లు, క్రాస్ ఫైర్లు, విడాకులు జరగవు.. నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థను దేశానికే ఆదర్శంగా అభివృద్ధి చేస్తాం.. సీఎం చంద్రబాబు

Woman: దిండుక్కల్‌‍లో ఘోరం.. బస్సు నుంచి కిందపడిన మహిళ మృతి (video)

Telugu Love: అబ్బా.. ఎంత బాగా తెలుగు మాట్లాడారు.. కృతికా శుక్లాపై పవన్ ప్రశంసలు

ఏలూరు: అర్థరాత్రి తలుపులు పగలగొట్టి యువతిపై ఇద్దరు రౌడీషీటర్లు అత్యాచారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

తర్వాతి కథనం
Show comments