Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాల్ సరసన కేథరిన్: పందెం కోడి సీక్వెల్‌లో హీరోయిన్‌గా లక్కీ ఛాన్స్

Webdunia
గురువారం, 2 జులై 2015 (12:31 IST)
అల్లు అర్జున్ హీరోయిన్ కేథరిన్ థెరీసా కోలీవుడ్‌లో మంచి ఆఫర్లు చేజిక్కించుకుంటోంది. పందెం కోడి సీక్వెల్‌లో కేథరిన్ హీరోయిన్‌గా ఎంపికైంది. ఈ చిత్రంలో ఆరడుగుల హీరో విశాల్ సరసన కేథరిన్ నటించనుంది. వరుసబెట్టి తమిళ చిత్రాలు చేస్తున్న కేథరిన్‌ని అనుకోకుండా ఈ ఛాన్స్ కొట్టేసింది. విశాల్ సినిమా కోసం ఇతర హీరోయిన్లను యూనిట్ సంప్రదించింది. అయితే హీరోయిన్లందరూ ఇతర సినిమాల్లో బిజీ బిజీగా ఉండటంతో.. కేథరిన్‌ని ఈ అవకాశాన్ని కైవసం చేసుకుంది. 
 
గతంలో లింగుస్వామి దర్శకత్వంలో విశాల్ నటించిన తమిళ సినిమా తెలుగు పందెం కోడి పేరుతో విడుదలై గెలుపును నమోదు చేసుకుంది. అదే కాంబినేషన్లో ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ చేస్తున్నారు. ఈ సినిమాలో కథానాయికలుగా సమంతా .. తమన్నాల పేర్లు కూడా వినిపించాయి.

అయితే అందులో నిజం లేదని విశాల్ స్వయంగా చెప్పాడు. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ సినిమాలో విశాల్ జంటగా కేథరిన్ కనిపించనుంది. ఈ నెలలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని కోలీవుడ్ వర్గాల సమాచారం. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments