అల్లు అర్జున్ హీరోయిన్ కేథరిన్ థెరీసా కోలీవుడ్లో మంచి ఆఫర్లు చేజిక్కించుకుంటోంది. పందెం కోడి సీక్వెల్లో కేథరిన్ హీరోయిన్గా ఎంపికైంది. ఈ చిత్రంలో ఆరడుగుల హీరో విశాల్ సరసన కేథరిన్ నటించనుంది. వరుసబెట్టి తమిళ చిత్రాలు చేస్తున్న కేథరిన్ని అనుకోకుండా ఈ ఛాన్స్ కొట్టేసింది. విశాల్ సినిమా కోసం ఇతర హీరోయిన్లను యూనిట్ సంప్రదించింది. అయితే హీరోయిన్లందరూ ఇతర సినిమాల్లో బిజీ బిజీగా ఉండటంతో.. కేథరిన్ని ఈ అవకాశాన్ని కైవసం చేసుకుంది.
గతంలో లింగుస్వామి దర్శకత్వంలో విశాల్ నటించిన తమిళ సినిమా తెలుగు పందెం కోడి పేరుతో విడుదలై గెలుపును నమోదు చేసుకుంది. అదే కాంబినేషన్లో ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ చేస్తున్నారు. ఈ సినిమాలో కథానాయికలుగా సమంతా .. తమన్నాల పేర్లు కూడా వినిపించాయి.
అయితే అందులో నిజం లేదని విశాల్ స్వయంగా చెప్పాడు. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ సినిమాలో విశాల్ జంటగా కేథరిన్ కనిపించనుంది. ఈ నెలలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని కోలీవుడ్ వర్గాల సమాచారం.