Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీవిత కార్యదర్శులపై కేసు ... 'బతుకు జట్కాబండి'కి రమ్మని బెదిరింపులు

సినీ నటి జీవిత కార్యదర్శులపై కేసు నమోదైంది. ఆమె సారథ్యంలో నిర్వహిస్తున్న 'బతుకు జట్కాబండి'కి రమ్మని బెదిరింపులకు పాల్పడినందుకు ఈ కేసులు నమోదయ్యాయి. దీంతో హైదరాబాద్ చిలకలగూడ పోలీసులు కేసు నమోదుచేశారు.

Webdunia
మంగళవారం, 27 సెప్టెంబరు 2016 (11:49 IST)
సినీ నటి జీవిత కార్యదర్శులపై కేసు నమోదైంది. ఆమె సారథ్యంలో నిర్వహిస్తున్న 'బతుకు జట్కాబండి'కి రమ్మని బెదిరింపులకు పాల్పడినందుకు ఈ కేసులు నమోదయ్యాయి. దీంతో హైదరాబాద్ చిలకలగూడ పోలీసులు కేసు నమోదుచేశారు. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
పార్శిగుట్ట సవరాల బస్తీకి చెందిన పి.కొండ(29) ఆటో డ్రైవర్‌. 2005వ సంవత్సరంలో పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో జ్యోతి అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమార్తె సంపూర్ణ(9). రెండో కాన్పులో జ్యోతికి టీబీ వ్యాధి రావడంతో బాబుపుట్టి చనిపోయాడు. అనారోగ్యంగా ఉన్న జ్యోతి తల్లిగారింటివద్ద ఉంటోంది. 
 
గ్రామ పెద్దల సమక్షంలో భార్యాభర్తలు సంతకాలు చేసుకుని విడిపోయారు. జ్యోతికి కొండ లక్ష రూపాయలు ఇచ్చాడు. ఇటీవల జ్యోతి బతుకు జట్కాబండి కార్యక్రమ నిర్వాహకురాలు జీవిత రాజశేఖర్‌ను ఆశ్రయించింది. దీంతో జీవిత వ్యక్తిగత కార్యదర్శులు కిరణ్‌, మరో మహిళ.. కొండ అతని తమ్ముడికి ఫోన్లుచేసి బెదిరించడం ప్రారంభించారు. వారి మాటలను రికార్డు చేసి కొండ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

దేశ వ్యాప్తంగా స్వల్పంగా పెరిగిన రైలు చార్జీలు...

పోలవరం - బనకచర్ల ప్రాజెక్టుకు నో పర్మిషన్ : కేంద్రం

ఏపీ లిక్కర్ స్కామ్ : చెవిరెడ్డికి షాకిచ్చిన సిట్ బృందం .. ఇద్దరు పీఏలు అరెస్టు?

దేశంలో కీలక నిబంధనల్లో మార్పులు.. ఐటీఆర్, క్రెడిట్ కార్డులు, తత్కాల్‌ టిక్కెట్ల బుకింక్‌కు ఆధార్ లింక్...

మహిళకు మత్తుమందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడిన ఆర్ఎంపీ వైద్యుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments