మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్తో 'ఫేస్బుక్' హీరో ఉదయ్ కిరణ్కు సంబంధం సమాచారం. హీరో ఉదయ్ నటించిన రెండు చిత్రాల్లో భాను పెట్టుబడులు పెట్టినట్టు తెలుస్తోంది. అలాగే, జైల్లో ఉన్న భానును ఉదయ్ పలు మార్లు కలిసినట్టు వార్తలు వస్తున్నాయి.
'ఫేస్బుక్' హీరో ఉదయ్కిరణ్ తప్పతాగి హైదరాబాద్ హోటల్ దసపల్లాలో అద్దాలు ధ్వంసం చేసి హల్చల్ చేసిన విషయం తెలిసిందే. అయితే సీసీ కెమెరాలో రికార్డయిన దృశ్యాల ఆధారంగా హోటల్ మేనేజ్మెంట్ ఫిర్యాదుతో జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేశారు. గతంలో డ్రగ్స్ కేసులో ఉదయ్కిరణ్ పట్టుబడ్డాడని పోలీసులు తెలిపారు.
కాగా, దసపల్లా హోటల్లో జరిగిన దాడితో తనకెలాంటి సంబంధం లేదనీ, అసలు ఆ రోజు తాను హోటల్లో లేనని ఉదయ్ కిరణ్ వాదిస్తూ వచ్చాడు. అయితే, హోటల్ యాజమాన్యం ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు.. హోటల్ సీసీటీవీ కెమెరాల్లో నమోదైన ఫూటేజీని వెలికి తీయగా, అందులో మద్యం మత్తులో ఉదయ్ కిరణ్ చేసిన హంగామా, అక్కడివున్న వారిపై దాడిచేసినట్టు స్పష్టంగా తెలుస్తోంది. దీంతో ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.