Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరో సీనియర్ నరేష్‌ సతీమణి రమ్య రఘుపతిపై కేసు

Webdunia
మంగళవారం, 22 ఫిబ్రవరి 2022 (17:35 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన హీరో సీనియర్ నరేష్ మూడో భార్య రమ్య రఘుపతిపై పోలీస్ కేసు నమోదైంది. నరేష్ పేరుతో డబ్బు వసూళ్లకు పాల్పడుతున్నారంటూ హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలో పోలీస్ స్టేషనులో ఐదుగురు మహిళలు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
ఈ మహిళలు ఇచ్చిన ఫిర్యాదులో హిందూపూర్, అనంతపూర్, హైదరాబాద్ నగరాల్లో భారీగా డబ్బులు వసూలు చేశారని పేర్కొన్నారు. నరేష్‌కు చెందిన ఆస్తులను చూపిస్తూ, ఈ ఆస్తులు తనకే చెందుతాయని పేర్కొంటూ డబ్బు వసూళ్లు చేస్తున్నారని వారు పేర్కొన్నారు. 
 
మరోవైపు, ఈ వ్యవహారంపై హీరో నరేష్ స్పందించారు. రమ్యకు తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కాగా, రమ్య రఘుపతి ఏపీ రాజకీయ నేత, మాజీ మంత్రి ఎన్.రఘువీరా రెడ్డి తమ్ముడు కుమార్తె కావడం గమనార్హం. కాగా, నరేష్‌కు రమ్య రఘుపతి మూడో భార్య. ఎనిమిదేళ్ల క్రితం పెళ్లాడారు. గత కొంతకాలంగా వీరు వేర్వేరుగా ఉంటున్నారు. 

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments