Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరో సీనియర్ నరేష్‌ సతీమణి రమ్య రఘుపతిపై కేసు

Webdunia
మంగళవారం, 22 ఫిబ్రవరి 2022 (17:35 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన హీరో సీనియర్ నరేష్ మూడో భార్య రమ్య రఘుపతిపై పోలీస్ కేసు నమోదైంది. నరేష్ పేరుతో డబ్బు వసూళ్లకు పాల్పడుతున్నారంటూ హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలో పోలీస్ స్టేషనులో ఐదుగురు మహిళలు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
ఈ మహిళలు ఇచ్చిన ఫిర్యాదులో హిందూపూర్, అనంతపూర్, హైదరాబాద్ నగరాల్లో భారీగా డబ్బులు వసూలు చేశారని పేర్కొన్నారు. నరేష్‌కు చెందిన ఆస్తులను చూపిస్తూ, ఈ ఆస్తులు తనకే చెందుతాయని పేర్కొంటూ డబ్బు వసూళ్లు చేస్తున్నారని వారు పేర్కొన్నారు. 
 
మరోవైపు, ఈ వ్యవహారంపై హీరో నరేష్ స్పందించారు. రమ్యకు తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కాగా, రమ్య రఘుపతి ఏపీ రాజకీయ నేత, మాజీ మంత్రి ఎన్.రఘువీరా రెడ్డి తమ్ముడు కుమార్తె కావడం గమనార్హం. కాగా, నరేష్‌కు రమ్య రఘుపతి మూడో భార్య. ఎనిమిదేళ్ల క్రితం పెళ్లాడారు. గత కొంతకాలంగా వీరు వేర్వేరుగా ఉంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నూలు జిల్లాలో రిలయన్స్ ప్లాంట్.. ఏం తయారు చేస్తారు?

వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి వర్ష సూచన

ఆర్కెస్ట్రా డ్యాన్సర్‌ను పెళ్లి చేసుకున్నాడనీ వ్యక్తి దారుణ హత్య!

మియాపూర్‌లో పేద విద్యార్థులకు బ్యాక్ టు క్లాస్‌రూమ్ కిట్‌లను పంపిణీ చేసిన క్వాలిజీల్

345 రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు : ఈసీ సంచలన నిర్ణయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments