Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధనుష్‌తో జతకట్టనున్న ప్రియాంక అరుళ్ మోహన్ (video)

Webdunia
మంగళవారం, 20 సెప్టెంబరు 2022 (12:21 IST)
"గ్యాంగ్‌లీడర్" సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ప్రియాంక అరుళ్ మోహన్‌. మొదటి సినిమాతోనే యూత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత 'డాక్టర్', 'డాన్‌', 'ఈటీ' వంటి తమిళ డబ్బింగ్ సినిమాలతో మరింత చేరువైంది. 
 
ప్రస్తుతం ప్రియాంక స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ బిజీ బిజీగా మారిపోయింది. తాజాగా ఈమె మరో స్టార్ హీరోతో జతకట్టనుంది. ఆ స్టార్ హీరో మరెవరో కాదు. తమిళ నటుడు ధనుష్‌.
 
కోలీవుడ్‌కు సమానంగా టాలీవుడ్‌లో క్రేజ్ తెచ్చుకుంటున్నాడు ధనుష్‌. ఇటీవలే విడుదలైన "తిరు"తో వంద కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఇటీవలే ధనుష్ "కెప్టెన్ మిల్లర్" అనే గ్యాంగ్ స్టర్ డ్రామా చిత్రాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రంలో హీరోయిన్‌గా ప్రియాంక మోహన్ ఎంపికైంది. 
 
ఈ చిత్రం ధనుష్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కనుందట. ఇక టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ఈ చిత్రంలో కీలకపాత్ర పోషించనున్నాడు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జగన్ కారు చక్రాల కింద సింగయ్య నలిగిపోయే దృశ్యాలు భయానకరంగా ఉన్నాయి : షర్మిల

హర్మూజ్ జలసంధి మూసివేత.. భారత్‌లో పెరగనున్న పెట్రోల్ ధరలు?

కారుపై నుంచి జగన్ అభివాదం చేస్తుంటే.. కారు చక్రాల కింద సింగయ్య నలిగిపోయాడు..(Video)

అమెజాన్ సామాజిక అభివృద్ధి: తెలంగాణ రంగారెడ్డి జిల్లాలో 4వ మోడల్ స్కూల్‌ పునరుద్ధరణ

శత్రుత్వాన్ని తగ్గించుకోండి.. దౌత్యపరంగా పరిష్కరించుకోండి... మోడీ సూచన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments