Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధనుష్‌తో జతకట్టనున్న ప్రియాంక అరుళ్ మోహన్ (video)

Webdunia
మంగళవారం, 20 సెప్టెంబరు 2022 (12:21 IST)
"గ్యాంగ్‌లీడర్" సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ప్రియాంక అరుళ్ మోహన్‌. మొదటి సినిమాతోనే యూత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత 'డాక్టర్', 'డాన్‌', 'ఈటీ' వంటి తమిళ డబ్బింగ్ సినిమాలతో మరింత చేరువైంది. 
 
ప్రస్తుతం ప్రియాంక స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ బిజీ బిజీగా మారిపోయింది. తాజాగా ఈమె మరో స్టార్ హీరోతో జతకట్టనుంది. ఆ స్టార్ హీరో మరెవరో కాదు. తమిళ నటుడు ధనుష్‌.
 
కోలీవుడ్‌కు సమానంగా టాలీవుడ్‌లో క్రేజ్ తెచ్చుకుంటున్నాడు ధనుష్‌. ఇటీవలే విడుదలైన "తిరు"తో వంద కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఇటీవలే ధనుష్ "కెప్టెన్ మిల్లర్" అనే గ్యాంగ్ స్టర్ డ్రామా చిత్రాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రంలో హీరోయిన్‌గా ప్రియాంక మోహన్ ఎంపికైంది. 
 
ఈ చిత్రం ధనుష్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కనుందట. ఇక టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ఈ చిత్రంలో కీలకపాత్ర పోషించనున్నాడు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం - ఉత్తర కోస్తా జిల్లాలకు భారీ వర్ష సూచన

కుమార్తెపై బహిష్కరణ వేటు వేసిన తండ్రి కేసీఆర్

చనిపోయాడనుకున్న వ్యక్తిని ఆ పచ్చబొట్టు కాపాడింది.. నిరంజన్ రెడ్డి అలా కాపాడారు

ప్లీజ్.. ఎమ్మెల్యే పింఛన్ మంజూరు చేయండి : దరఖాస్తు చేసుకున్న మాజీ ఉపరాష్ట్రపతి

TGSRTC: ఐటీ కారిడార్‌లో 275 ఎలక్ట్రిక్ బస్సులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments