చాముండేశ్వరి మాత ఆశీస్సులతో ఆర్సీ16 ప్రారంభం

ఠాగూర్
శుక్రవారం, 22 నవంబరు 2024 (09:37 IST)
'ఉప్పెన' ఫేం బుచ్చిబాబు సాన, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ల కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఇది రామ్ చరణ్ నటించే 16వ చిత్రం. ఈ చిత్రం గురించి దర్శకుడు బుచ్చిబాబు సాన కీలక అప్డే ఇచ్చారు. కర్నాటక రాష్ట్రంలోని చాముండేశ్వరి మాత ఆశీస్సులతో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించారు. 
 
ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ అప్డేట్ కోసం మెగా అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం మైసూరులో చాముండేశ్వరి మాత ఆశీస్సులతో షూటింగును ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. అందరి ఆశీస్సులు కావాలంటూ చాముండేశ్వరి మాత ఆలయం ముందు దిగిన ఫొటోను ఆయన 'ఎక్స్' ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.
 
ఇక్కడ చెర్రీతో పాటు ప్రధాన తారాగణంపై కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తారని సమాచారం. ఇక ఉత్తరాంధ్ర నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామాగా 'ఆర్సీ16' చిత్రాన్ని రూపొందించనున్నారు. ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఏ.ఆర్.రెహహాన్ బాణీలు అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భారీ వ్యయంతో దీనిని నిర్మిస్తోంది. ఇదిలాఉంటే.. రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్‌లో తాజా చిత్రం 'గేమ్ ఛేంజర్' జనవరి 10న ప్రేక్షకుల ముందుకురానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Aishwarya Rai: మానవాళికి సేవ చేయడంలోనే నిజమైన నాయకత్వం వుంది.. ఐశ్వర్యా రాయ్

మావోయిస్టు పార్టీకి దెబ్బమీద దెబ్బ - ఒక్కొక్కరుగా చనిపోతున్నారు...

అందుకే హెయిర్ కట్ చేసుకునేందుకు ఇష్టపడను.. పుట్టపర్తిలో సచిన్ కామెంట్స్

భారత్ పెద్ద మనసు వల్లే నా తల్లి ప్రాణాలతో ఉన్నారు : షేక్ హసీనా కుమారుడు

Sathya Sai Baba: సత్యసాయి బాబా సేవ, కరుణ మూర్తీభవించిన వ్యక్తి.. బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments