Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను జీవించి ఉన్నంత వరకు ఆమె బయోపిక్ రాదు : నిర్మాత బోనీ కపూర్

ఠాగూర్
గురువారం, 4 ఏప్రియల్ 2024 (13:48 IST)
అందాల నటి, తన భార్య దివంగత శ్రీదేవి బయోపిక్‌పై ఆమె భర్త, బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు ఆమె బయోపిక్ వెండితెరపై దృశ్యకావ్యంగా రాదని ఆయన తేల్చిచెప్పారు. బయోపిక్ అంటే నిజాలను వక్రీకరించే అవకాశం ఉందని, అందుకే తన భార్య ఆలోచనల ప్రకారం తన బయోపిక్ తీయడానికి తాను అంగీకరించబోనని చెప్పారు.
 
అజయ్ దేవగణ్ హీరో బోనీ కపూర్ తాజాగా నిర్మించిన చిత్రం "మైదాన్". ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా బోనీ కపూర్ మాట్లాడుతూ, తన భార్య శ్రీదేవి వ్యక్తిగత జీవితానికి చాలా ప్రాధాన్యత ఇచ్చేదని చెప్పారు. వ్యక్తిగత విషయాలను బయటకు తెలియాల్సిన అవసరం లేదని ఆమె చాలా స్పష్టంగా చెప్పేవారు. ఆమె ఆలోచనలను, వ్యక్తిత్వానికి తాను ఎంతో గౌరవిస్తాను, విలువనిస్తాను అని చెప్పారు. పైగా బయోపిక్ అంటే నిజాలను వక్రీకరించే అవకాశం ఉంది. అందుకే తన భార్య ఆలోచనలు ప్రకారం తన బయోపిక్ తీయడానికి తాను సమ్మతించబోనని చెప్పారు. 
 
కాగా, చాలా రోజులుగా శ్రీదేవి బయోపిక్‌ పేరుతో ఓ సినిమా తీయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఇదే విషయంపై బోనీ కపూర్‌తో కూడా సంప్రదింపులు జరిపినట్టు వార్తలు కూడా వచ్చాయి. ఇపుడు ఈ వార్తలపై ఆయన క్లారిటీ ఇచ్చారు. కాగా, 'మైదాన్' చిత్రం ఈ నెల 10వ తేదీన విడుదలకానుంది. అమిత్ రవీంద్రనాథ్ శర్మ దర్శకత్వం వహించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగాల జాతర : ఎండీ సజ్జనార్ వెల్లడి

తిరుమల గిరుల్లో వైసీపీ నిఘా నేత్రాలు : భూమన కరుణాకర్ రెడ్డి

ది గోల్కొండ బ్లూ- అరుదైన నీలి వజ్రం- మే 14న జెనీవాలో వేలానికి సిద్ధం (video)

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలుగు విద్యార్థిని పరిస్థితి విషమం

తిరుగుబాటు చట్టాలను అమలు చేయనున్న డోనాల్డ్ ట్రంప్ - 20న ఆదేశాలు జారీ!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments