Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్ నటి నర్సుగా మారి కరోనా రోగులకు సేవ, కానీ పక్షవాతం ఆమెను ఆక్రమించింది

Webdunia
మంగళవారం, 15 డిశెంబరు 2020 (20:20 IST)
ఫోటో కర్టెసీ-ట్విట్టర్
పరులకు సేవ చేయాల్సిన ఆలోచన అందరికీ ఉండదు. ఏ కొందరికో ఆ ఆశయం ఉంటుంది. అలాంటి వారిలో శిఖా మల్హోత్రా ఒకరు. సినిమాల్లో అడుగుపెట్టక ముందే నర్సింగ్ కోర్సు చేసిన శిఖ కరోనా బారిన పడినా ప్రజలకు తనవంతు సహాయం చేయాలనుకున్నారు.
 
లాక్ డౌన్ కాలంలో ముంబైలోని మున్సిపల్ కార్పొరేషన్లో నడిచే ఆసుపత్రిలో నర్సుగా చేరింది మల్హోత్రా. ఆరు నెలల పాటు నిద్రాహారాలు మానేసి రోగులకు సేవలందించింది. కానీ అనుకోని విషాదం ఆమె అందమైన జీవితాన్ని తలకిందులు చేసేసింది. గత అక్టోబర్ నెలలో కరోనా మహమ్మారి బారిన పడింది.
నెల రోజుల తరువాత కోలుకుంది. అయితే డిసెంబర్ 10వ తేదీన పక్షవాతానికి గురికావడంతో ఆమెను హుటాహుటిన ముంబైలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. రానురాను ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఆమె శరీరంలోని కుడివైపు భాగమంతా చచ్చుపడిపోయింది. నోటమాట కూడా రావడం లేదు. ఆమె పరిస్థితి చాలా విషమంగా ఉందని వైద్యులు స్పష్టం చేశారు. అయితే ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు. మనమూ ప్రార్థిద్దాం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వాళ్లపాటికి వాళ్లు చచ్చిపోయారు, మాపాటికి మేము ఖుషీగా చిందులేస్తాం: ఇదీ ఎయిర్ ఇండియా సాట్స్ ఎస్విపి

ప్రియుడు మరో యువతిని పెళ్లి చేసుకున్నాడనీ... భగ్నప్రేమికురాలి బాంబు బెదిరింపులు

పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది.. ఎన్నికల్లో విజయం మాదే : సజ్జల

Airspace ban: గగనతల మూసివేతను జూలై 24 వరకు పొడిగించిన భారత్

LPG: లీక్ అయిన ఎల్పీజీ సిలిండర్.. కాసేపయ్యాక భారీ పేలుడు.. ఆ ఇద్దరికి ఏమైంది..? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments