Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందరూ కరోనాతో చనిపోతుంటే ఆ హీరోయిన్ ఆ వ్యాధితో మరణించింది

Webdunia
సోమవారం, 13 జులై 2020 (22:59 IST)
ఇప్పుడు ఎవరు చనిపోయినా కరోనానే అని బాగానే ప్రచారం చేసేస్తున్నారు. అనారోగ్య సమస్యలతో ఎవరు చనిపోయినా ఇదే పరిస్థితి. ఇదే రకరమైన ప్రచారం జరుగుతోంది. అయితే సినీనటి, ప్రముఖ మోడల్ దివ్య చౌక్సీ మరణం మాత్రం బాలీవుడ్‌ను తీవ్ర విషాదంలోకి తీసుకెళ్ళిపోయింది. 
 
ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న యువనటి మరణించడంతో సినీ పరిశ్రమ మొత్తం కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. దివ్య చౌక్సీ పలు టెలివిజన్ సీరియల్స్‌లో అద్భుతమైన ప్రతిభను చాటింది. అలాగే హిందీ ప్రేక్షకులందరికీ సుపరిచితురాలు. నటిగానే కాకుండా పలు వ్యాపార ప్రకటనల్లో నటించింది. 
 
హై అప్పా దిల్‌తో ఆవారా అనే చిత్రంతో ఆమెకు మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే 2018 సంవత్సరంలో పాటియాలే ది క్వీన్ అంటూ సింగర్‌గా మారారు. లండన్‌లో యాక్టింగ్ నేర్చుకున్న దివ్య గత కొన్ని నెలలుగా అనారోగ్యానికి గురయ్యారు.
 
అనారోగ్యంగా ఉన్నట్లు తానే స్వయంగా ఒక ట్వీట్ కూడా చేశారు. నేను ప్రస్తుతం బెడ్ మీద ఉన్నాను. క్యాన్సర్‌తో బాధపడుతున్నాను. తిరిగిమీ దగ్గరకు వస్తానన్న నమ్మకం కూడా నాకు తగ్గుతోంది. కానీ మీ అభిమానం నన్ను బతికిస్తుందని నమ్ముతానని సందేశం పంపింది. కానీ చివరకు చికిత్స పొందుతూ తిరిగి రాని లోకాలకు ఆమె వెళ్లిపోయింది. దివ్య మరణంపై పలువురు ప్రముఖులు సంతాపాన్ని తెలియజేశారు. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments