దీపికా పదుకునే తలకు వెలకట్టిన బీజేపీ నేత రాజీనామా

బాలీవుడ్ అగ్ర హీరోయిన్ దీపికా పదుకునే కీలక పాత్రలో నటించిన పద్మావతి చిత్రాన్ని ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు నిషేధించాయి. దీన్ని దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా ఖండించింది. పద్మావతీ సినిమాకు వ్యతిరేకం

Webdunia
బుధవారం, 29 నవంబరు 2017 (16:03 IST)
బాలీవుడ్ అగ్ర హీరోయిన్ దీపికా పదుకునే కీలక పాత్రలో నటించిన పద్మావతి చిత్రాన్ని ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు నిషేధించాయి. దీన్ని దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా ఖండించింది. పద్మావతీ సినిమాకు వ్యతిరేకంగా పలు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ నేతలు బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు. దీనిపై ధర్మాసనం సీరియస్ అయ్యింది. ఇలాంటి వ్యాఖ్యలు చట్టాలను అతిక్రమించినట్లేనని.. ఈ విషయాన్ని సదరు వ్యక్తులకు తెలియజేయాలని అదనపు సొలిసిటర్స్‌ జనరల్‌ మనిందర్, పీఎస్‌ నరసింహాలను ఆదేశించింది. 
 
ఇప్పటికే పద్మావతిపై హర్యానా బీజేపీ నేతలు, యూపీ సీఎం యోగి మండిపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దీపికా పదుకునే, దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీల తలలకు రూ.10కోట్లు వెలకట్టిన బీజేపీ హైకమాండ్ సీరియస్ అయ్యింది. షోకాజ్ నోటీసులు జారీ చేసి వివరణ కోరింది. దీంతో బీజేపీ సూరజ్ పాల్ రాజీనామా చేశారు. బీజేపీ అధిష్టానం, హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్‌తో విబేధాల కారణంగా తాను రాజీనామా చేశారని చెప్పారు. అయితే ఖట్టర్‌పై సూరజ్ పాల్ విమర్శలు గుప్పించారు. ఖట్టర్ లాంటి వ్యక్తిని తాను ఇంతవరకు చూడలేదన్నారు. కార్యకర్తలకు ఆయన కనీస గౌరవం కూడా ఇవ్వరన్నారు.
 
ఇకపోతే.. పద్మావతి సినిమాపై రాజ్ పుత్ కర్ణిసేన నిషేధం విధించాలని డిమాండ్ చేస్తోంది. అయితే హర్యానా సర్కారు సీబీఎఫ్‌సీ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేట్) నిర్ణయాన్ని బట్టి పద్మావతి సినిమా రిలీజ్‌పై నిర్ణయం వుంటుందని తేల్చేసింది. డిసెంబర్ 1 నాటికి పద్మావతి సినిమాను విడుదల చేయాల్సింది. కానీ ఆందోళనలు, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో ఈ సినిమాను బ్యాన్ చేయడంతో విడుదలక నోచుకోలేదు. అయితే సీబీఎఫ్‌సీ నిర్ణయం ప్రకారం పద్మావతి విడుదల వుంటుందని సినీ పండితులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అందుకే నేను చెప్పేది, పవన్ సీఎం అయ్యే వ్యక్తి, జాగ్రత్తగా మాట్లాడాలి: ఉండవల్లి అరుణ్ కుమార్

బాబాయ్ హత్యే జగన్‌కు చిన్న విషయం, ఇక పరకామణి చోరీ ఓ లెక్కనా: సీఎం చంద్రబాబు

AI దుర్వినియోగం, పాకిస్తాన్ పార్లమెంట్ లోకి దూసుకొచ్చిన గాడిద, కిందపడ్డ సభ్యులు (video)

Bharat Future City: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025కు అంతా సిద్ధం

కార్మికులు ఢిల్లీ వెళ్లి కొట్లాడేందుకు రూ.10 లక్షలు ఇస్తా : మాజీ మంత్రి మల్లా రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments