Webdunia - Bharat's app for daily news and videos

Install App

బింబిసారా ప్రీ రిలీజ్ ఈవెంట్‌: అభిమాని అనుమానాస్పద మృతి

Webdunia
శనివారం, 30 జులై 2022 (14:06 IST)
Bimbisara
బింబిసారా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈ ఈవెంట్‌కి జూనియర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యాడు. అయితే, ఈ ఫంక్షన్‌లో ఓ అభిమాని అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం ఆలస్యంగా వెలుగులోకి రావడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. 
 
మృతుడిది ఆంధ్రప్రదేశ్‌‌గా గుర్తించారు. కల్యాణ్‌రామ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఓ అభిమాని మృతి చెందడం ఎన్టీఆర్ అభిమానుల్లో ఆందోళన రేకెత్తించింది.  
 
ఇకపోతే.. తాడేపల్లిగూడేనికి చెందిన పుట్టా సాయిరామ్ కూకట్‌పల్లిలో ఉంటూ ప్రైవేట్ జాబ్ చేసుకుంటున్నాడు. ఇతను బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వచ్చాడు. 
 
ఈవెంట్‌కి వచ్చిన సాయిరామ్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. దాంతో మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. ఈ మృతిపై పూర్తి వివరాల కోసం పోలీసులు విచారణ చేపడుతున్నారు.

వెస్ట్ గోదావరి జిల్లా, పెంటపాడు మండలానికి చెందిన అభిమాని పుట్టా సాయిరామ్‌(సన్నాఫ్‌ రాంబాబు) మృతి పట్ల `బింబిసార` యూనిట్‌ స్పందించింది. ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఈవెంట్‌లో దురదృష్ణవశాత్తు అభిమాని మరణించాడనే వార్త తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్టు తెలిపింది.

పుట్టా సాయిరామ్‌ లేదనేది నిజంగా గుండెపడిలే వార్త. ఈ సందర్భంగా వారి కుటుంబానికి సంతాపాన్ని తెలియజేస్తున్నామని, సాయిరామ్‌ కుటుంబాన్ని సాధ్యమైన విధంగా అన్ని రకాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శ్రీవారి భక్తులకు భద్రత.. ప్రతి భక్తుడికి బీమా సౌకర్యం... ఎలా?

విశాఖ ఎక్స్‌ప్రెస్‌లొ దొంగల బీభత్సం... పోలీసుల కాల్పులు

భార్యాభర్తల మధ్య గొడవ.. మద్యం మత్తులో కుమార్తె గొంతుకోసి...

యాంకర్ స్వేచ్ఛతో సన్నిహిత సంబంధం నిజమే... : పూర్ణచందర్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం : సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments