Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ వారం ఎలిమినేషన్ లిస్టులో ఎవరు.. అమ్మ రాజశేఖర్ సెల్ఫ్..?

Webdunia
ఆదివారం, 1 నవంబరు 2020 (17:55 IST)
బిగ్ బాస్-4 తెలుగులో మరో ఎలిమినేషన్ కూడా జరుగుతుంది. ఈ వారం ఇప్పటికే నోయల్ అనారోగ్యం కారణంగా బయటికి వెళ్ళిపోయాడు. దాంతో మరొకర్ని పంపిస్తారో లేదో అనే అనుమానాలు ఉండేవి. కానీ ఇప్పుడు విడుదలైన ప్రోమో చూసిన తర్వాత క్లారిటీ వచ్చేసింది. ఎందుకంటే ఈ వారం మరో ఎలిమినేషన్ కూడా ఉండబోతుంది. దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేసారు షో నిర్వాహకులు. 
 
ఇది చూసిన తర్వాత అమ్మ రాజశేఖర్, మెహబూబ్ మరోసారి డేంజర్ జోన్‌లో ఉన్నారనే విషయం అర్థమైపోతుంది. అందర్నీ సేవ్ చేసిన తర్వాత ఈ ఇద్దర్నీ మాత్రం కన్ఫెషన్ రూమ్‌కు పిలిచాడు నాగార్జున. ఒకరు డాన్సర్.. మరొకరు డాన్స్ మాస్టర్ అంటూ మొదలు పెట్టాడు. ఒకరు గురువు.. మరొకరు శిష్యుడు.. ఈ ఇద్దరిలో ఎవరు హౌజ్‌కు అవసరం.. ఎవరు అవసరం లేదు అంటూ అడిగాడు.
 
అది మీ ఇద్దరే నిర్ణయించుకోవాలంటూ వాళ్లపైకే వదిలేసాడు నాగార్జున. ఆ తర్వాత కన్ఫెషన్ రూమ్ నుంచి మెహబూబ్ మాత్రమే బయటికి వచ్చాడు. అమ్మ కనిపించడం లేదు.. మరోవైపు అమ్మ రాజశేఖర్‌ను చూస్తూ మెహబూబ్ భోరున ఏడ్చేస్తున్నాడు. దీన్నిబట్టి చూస్తుంటే అమ్మ సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే నోయల్ వెళ్తూ వెళ్తూ చేసిన కామెంట్స్‌కు చాలా హర్ట్ అయ్యాడు అమ్మ.
 
తన పేరు కూడా కావాలనే నాశనం చేసాడంటూ విరుచుకుపడుతున్నాడు. అందుకే ఇంట్లో ఉండకూడదని నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. అవకాశం వచ్చింది కాబట్టి మెహబూబ్‌ను సేవ్ చేసి అమ్మ తనను తాను ఎలిమినేట్ చేసుకున్నట్లు తెలుస్తుంది.

సంబంధిత వార్తలు

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

ఏపీ ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్‌లు.. లక్షల్లో లావాదేవీలు

పల్నాడులో ఫలితం ముందే తెలిసిపోయిందా? అందుకే అలా?

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments