Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్‌ను కించపరచలేదు.. బిగ్‌బాస్ గురించే మాట్లాడాను: మానస హిమవర్షి

టాలీవుడ్‌లో తన అభిమాన నటుడు ఎన్టీఆరేనని, గతంలో ఈ విషయాన్ని చాలా ఇంటర్వ్యూల్లో చెప్పానని కూడా మానస గుర్తు చేశారు. తాను కేవలం బిగ్‌బాస్ షో గురించే మాట్లాడానని.. ఎక్కడ ఎన్టీఆర్‌ను కించపరిచేలా కామెంట్స్

Webdunia
మంగళవారం, 18 జులై 2017 (17:06 IST)
రొమాన్స్ సినిమాతో తెరంగేట్రం చేసిన మానస హిమవర్షి.. ఇటీవల విడుదలైన వంశీ ఫ్యాషన్ డిజైనర్‌లో నటించింది. కాటమరాయుడులో శివబాలాజీకి జంటగా కనిపించింది. అయితే తాజాగా మానస వార్తల్లో నిలిచింది. ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘బిగ్‌బాస్’ షో మొదటి ఎపిసోడ్ పూర్తయిన అనంతరం ‘ఈ షోలో నేను భాగం కాకపోయినందుకు చాలా సంతోషంగా ఉంది’ అని సోషల్‌ మీడియాలో హిమవర్ష పోస్ట్ చేయడంతో ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆమె ఎన్టీఆర్‌ను కించపరిచారని ఆయన ఫ్యాన్స్ మండిపడ్డారు. దీంతో మానస జూనియర్ ఎన్టీఆర్‌ను కించపరచలేదని మానస హిమవర్ష వివరణ ఇచ్చారు. 
 
టాలీవుడ్‌లో తన అభిమాన నటుడు ఎన్టీఆరేనని, గతంలో ఈ విషయాన్ని చాలా ఇంటర్వ్యూల్లో చెప్పానని కూడా మానస గుర్తు చేశారు.  తాను కేవలం బిగ్‌బాస్ షో గురించే మాట్లాడానని.. ఎక్కడ ఎన్టీఆర్‌ను కించపరిచేలా కామెంట్స్ చేయలేదని తెలిపారు. ఎన్టీఆర్‌ను కించపరిచానంటూ తన వ్యాఖ్యలను వక్రీకరించొద్దన్నారు. తాను ఇదంతా పబ్లిసిటీ కోసం చేయలేదని స్పష్టం చేశారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇజ్రాయెల్‌ నిబద్ధతపై అనుమానాలు : ఇరాన్

ఏపీలో మూడు రోజుల విస్తారంగా వర్షాలు

సింగయ్య మృతి కేసు : ఆ కారు జగన్మోహన్ రెడ్డిదే..

బంగ్లాదేశ్‌లో హిందూ మహిళపై అత్యాచారం

మాజీ సీఎం జగన్‌కు షాకివ్వనున్న జొన్నలగడ్డ పద్మావతి దంపతులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments