దొరసాని ఫేమ్ కే వీ ఆర్ మహేంద్ర దర్శకత్వంలో పీ ఆర్ ఫిల్మ్స్ బ్యానర్ పై పాయల్ సరాఫ్ నిర్మిస్తున్న చిత్రం భరతనాట్యం. “సినిమా ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఫ్రాడ్ ఇన్ ద వరల్డ్” అనేది క్యాప్షన్. సూర్యతేజ ఏలే, మీనాక్షి గోస్వామి హీరో హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రంలోని మొదటి పాటని ఇటీవల విడుదల చేయగా మంచి స్పందన లభించింది. అదే ఊపులో ఇప్పుడు రెండో పాటను విడుదల చేసారు. వివేక్ సాగర్ మ్యూజిక్ చేసిన ఈ పాటను ఆంథోనీ దాసన్ తన విలక్షణ శైలీలో పాడారు.
ఇందులో సినిమా దర్శకుడు అవ్వాలనుకునే కథానాయకుడికి ఎదురైన ఇబ్బందులు, దురదృష్టానికి చిహ్నంగా ఉన్న అతని పరిస్థితులను రచయిత అనంత శ్రీరామ్ తనదైన విలక్షణమైన శైలీలో “ఎట్టరో.. ఎట్టెట్ట ఎట్టరో… నీ ఉల్టా జాతకo మారేది ఎట్ట... తలరాతలు రాసే వానికే తల తిరిగే కథ నీది.. విధి రాతలు మార్చిన వానినే విసిగించే ధశ నీది” అంటూ రాశారు. క్యాచీ ట్యూన్, ఎనర్జిటిక్ బీట్స్ తో యూత్ ఫుల్ గా సాగే ఈ పాట అందరినీ అలరిస్తుంది. మేకర్స్ త్వరలో ఈ చిత్ర విడుదల తేదీని ప్రకటించనున్నారు.