Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫేక్ నాయకులతో తస్మాత్ జాగ్రత్త.. ఏపీ ప్రజలకు పూనమ్ కౌర్ వినతి

Webdunia
సోమవారం, 17 జులై 2023 (15:10 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సినీ నటి పూనమ్ కౌర్ ఓ విజ్ఞప్తి చేశారు. ఎన్నికలు సమీపించడంతో నకిలీ నాయకులు మీ ముందుకు వస్తున్నారని, వారితో జాగ్రత్తగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ ట్వీట్ చేశారు. దీనిపై పవన్ కళ్యాణ్ అభిమానులు మండిపడుతున్నారు. 
 
ఆదివారం ఆమె చేసిన ట్వీట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల హక్కులపై గొంతు చించుకుంటున్న నకిలీ నాయకులను నమ్మొద్దంటూ ఏపీ ప్రజలను ఆమె హెచ్చరించారు. రాష్ట్రంలో ఈ ఫేక్ లీడర్లు మహిళలకు హక్కులంటూ లేని అభిమానాన్ని ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. 
 
అంతగా అభిమానమే ఉంటే ఢిల్లీలో మొన్నటివరకు ఆందోళన చేసిన రైజర్లకు ఎందుకు మద్దతుగా ఒక్క మాట కూడా మాట్లాడలేదని ఆమె ప్రశ్నించారు. తమ సొంత ప్రయోజనాల కోసమే ఏపీలోని నకిలీ లీడర్లు మహిళలపై అభిమానాన్ని, ప్రేమను కురిపిస్తున్నారని విమర్శించారు. 
 
ఇపుడు ఈ పోస్టు చేసిన పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేనాని ఉద్దేశించి పూనమ్ కౌర్ ఈ పోస్ట్ పెట్టిందంటూ మండిపడుతున్నారు. మరోమారు ఇలాంటి ట్వీట్స్ చేస్తే ఏం జరుగుతుందో మీ ఊహకు కూడా అందదని పవన్ ఫ్యాన్స్ హెచ్చరిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం - విచారణలో కదలిక...

నీ అంతు చూస్తా... ఎమ్మెల్యే కొండబాబుకి ద్వారంపూడి అనుచరుడు భళ్లా సూరి వార్నింగ్ (video)

ఇన్‌స్టాగ్రామ్‌లో అక్కకు పెట్టిన మెసేజ్ ఆధారంగా గుర్తింపు!! తేజస్వి ఆచూకీ తెలిసిందిలా...

నార తీస్తున్న నాదెండ్ల మనోహర్, పరుగులు పెట్టిస్తున్న పవన్ కల్యాణ్ (video)

సంగారెడ్డిలో బాలుడిపై వీధి కుక్కల స్వైర విహారం.. (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments