Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐదు డైరీలు దొరికాయ్.. మన ఇద్దరం తప్పే.. తల్లికి సుశాంత్ కవిత

Webdunia
గురువారం, 18 జూన్ 2020 (17:47 IST)
యువ కథానాయకుడు​ సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్ జూన్‌ 14న బాంద్రాలోని తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. మానసిక ఒత్తిడి వల్లే ఆయన ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని తెలుస్తోంది. కానీ సుశాంత్‌ నివాసంలో ఎటువంటి సూసైడ్‌ నోట్‌ లభించలేదు. దీంతో పోలీసులు ఇది ఆత్మహత్యా.. లేకపోతే దీని వెనక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అని విచారణ కొనసాగిస్తున్నారు. 
 
ఇప్పటికే సుశాంత్‌ సన్నిహితులతోపాటుగా అతడి గర్ల్‌ ఫ్రెండ్‌ రియా చక్రవర్తి, దర్శకుడు ముఖేష్ చబ్రా నుంచి కూడా పోలీసులు విచారించారు. తాజాగా ముంబై పోలీసులు సుశాంత్‌ నివాసం నుంచి ఐదు పర్సనల్‌ డైరీలను స్వాధీనం చేసుకున్నట్టుగా తెలిసింది. ఈ డైరీలను నిపుణుల సమక్షంలో పూర్తి స్థాయిలో పరిశీలించనున్నారు. దీంతో అతని జీవితంలో ఏం జరిగిందనే దానిపై కొంతమేర స్పష్టత వస్తుందని పోలీసులు భావిస్తున్నారు.
 
అలాగే ప్రస్తుతం అమ్మపై సుశాంత్ రాసిన కవిత సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. '' అమ్మా నీకు గుర్తుందా.. ఎప్పటికి నాతోనే ఉంటానని నువ్వు నాకు వాగ్దానం చేశావు. అలానే ఎలాంటి పరిస్థితుల్లో అయినా నవ్వుతూనే ఉంటానని నేను నీకు మాట ఇచ్చాను. చూడబోతే మన ఇద్దరం తప్పని తెలుస్తుంది అమ్మా" అంటూ రాసుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments