Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలయ్య ప్లేస్‌లో వెంకీ కాదు రవితేజ

Balakrishna
Webdunia
బుధవారం, 15 ఏప్రియల్ 2020 (22:18 IST)
మలయాళంలో విజయం సాధించిన అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాని తెలుగులో రీమేక్ చేయనున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ రీమేక్ రైట్స్ ని ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ దక్కించుకుంది. ఇందులో నందమూరి బాలకృష్ణ - దగ్గుబాటి రానా నటించనున్నట్టు వార్తలు వచ్చాయి. దీంతో వీరిద్దరి కాంబినేషన్లో ఈ మూవీ రావడం ఖాయం అనుకున్నారు. 
 
అయితే.. బాలయ్య ఈ రీమేక్ విషయంలో అంతగా ఆసక్తి చూపించకపోవడంతో వేరే హీరోను చూస్తున్నారని మరో వార్త వచ్చింది. ఆ తర్వాత బాలయ్య ప్లేస్‌లో వెంకీ రానున్నాని టాలీవుడ్లో టాక్ వినిపించింది. అయితే.. సురేష్‌ బాబు వెంకీ - రానా కాంబినేషన్లో ఓ సినిమా చేయాలని ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నారు కానీ సెట్ కాలేదు. అయితే.. ఈ కథతో వీరిద్దరి కాంబినేషన్లో సినిమా చేస్తారనుకున్నారు. 
 
కానీ.. వెంకీకి ఈ సినిమా సెట్ కాదనే ఉద్దేశ్యంతో వెంకీ కాకుండా మరో హీరో కోసం ట్రై చేస్తున్నారని తెలిసింది. ఆ హీరో ఎవరో కాదు మాస్ మహారాజా రవితేజ అని తెలిసింది. ఈ కథ విని రవితేజ ఓకే చెప్పారని టాక్. ఈ సినిమాని సుధీర్ వర్మ డైరెక్ట్ చేయనున్నారని.. త్వరలోనే అఫిషియల్‌గా ఎనౌన్స్ చేస్తారని సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments