Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాక్ డౌన్ తర్వాత షూటింగ్ రంగ ప్రవేశంలోకి నందమూరి బాలకృష్ణ

Webdunia
గురువారం, 29 అక్టోబరు 2020 (21:51 IST)
కరోనా నేపథ్యంలో చిత్ర పరిశ్రమలో షూటింగులు పూర్తిగా స్తంభించిపోయాయి. ప్రస్తుతం అన్ లాక్ 5 సడలింపుతో పలు హీరోలు తమ షూటింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ ఈ రోజు నుంచి షూటింగ్ లోకి దిగారు. తనకు ఇప్పటికే రెండు హిట్లు ఇచ్చిన దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ తన మూడో చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే.
 
ద్వారకా క్రియేషన్ బ్యానర్ పైన మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లాక్ డౌన్ ముందు ఈ చిత్రానికి సంబంధించిన ఒక షెడ్యూల్ కూడా పూర్తయ్యింది. తర్వాత లాక్ డౌన్ పడటంతో గత ఏడు నెలలుగా వాయిదా పడింది. ఈ క్రమంలో కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఈ రోజు నుంచి హైదరాబాదులో తదుపరి షూటింగ్ నిర్వహిస్తున్నారు.
 
ఇందులో భాగంగా బాలయ్య కూడా షూటింగ్‌లో పాల్గొన్నారు. బోయపాటి మార్క్ హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాతో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రముఖ నటీ మీనా కీలక పాత్ర పోషిస్తుండగా.. మళయాల ముద్దుగుమ్మ ప్రయాగ మార్టిన్‌ను కథానాయికగా ఎంపిక చేసినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఇందులో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ముహూర్తం సమయంలో బ్లాకౌట్ - మొబైల్ లైట్ల వెలుగులో పెళ్లి!!

భారత్‌ను తుక్కు తుక్కుగా ఓడించాం : పాకిస్థాన్ ప్రధాని (Video)

Chandrababu: భారత్-పాక్ కాల్పుల విరమణ.. ఏపీ సీఎం చంద్రబాబు హర్షం

శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో వంద గ్రాముల బంగారం దోపిడీ

Nipah: మలప్పురం జిల్లాలో నిఫా వైరస్.. ఆ ఎనిమిది మందికి సోకలేదు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments