Webdunia - Bharat's app for daily news and videos

Install App

'అవతార్' సీక్వెల్ ట్రైలర్ జల ప్రపంచాన్ని ఆవిష్కరించింది..

Webdunia
సోమవారం, 9 మే 2022 (22:21 IST)
ఎంతోకాలంగా సినీ ప్రేక్షకులు ఎదురు చూస్తున్న అవతార్ సీక్వెల్ సినిమా డిసెంబరు నెలలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం ట్రైలర్‌ను సోమవారం రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ జలప్రపంచాన్ని ఆవిష్కరించింది. 
 
దశాబ్దకాలం క్రితం వచ్చిన అవతార్ ప్రపంచ వెండితెరపై చరిత్ర సృష్టించిన విషయం తెల్సిందే. అనేక భాషల్లోకి అనువాదం చేసిన నిర్మాతలకు కనకవర్షం కురిపించింది. 2009లో జేమ్స్ కామెరాన్ దర్శకత్వంలో ఈ చిత్రం వచ్చింది. ఇపుడు ఈ చిత్రం సీక్వెల్ రానుంది. డిసెంబరు 16వ తేదీన విడుదల కానుంది. 
 
"అవతార్: ది వే ఆఫ్ వాటర్" పేరుతో రూపొందిన ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో విడుదల కానుంది. ఏప్రిల్ 27న, లాస్ వెగాస్‌లోని సినిమాకాన్ ఎక్స్‌పోజిషన్‌లో చాలా కాలంగా ఎదురుచూస్తున్న సీక్వెల్ నుండి మొదటి ఫుటేజ్ ప్రదర్శించబడింది. ఈ సినిమా ట్రైలర్ ఎట్టకేలకు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చింది.
 
సిగోర్నీ వీవర్, కేట్ విన్స్‌లెట్, మిచెల్ యోహ్, ఈడీ ఫాల్కో, స్టీఫెన్ లాంగ్, గియోవన్నీ రిబిసి, ఊనా చాప్లిన్, జెర్మైన్ క్లెమెంట్ మరియు ఇతరులు కూడా సీక్వెల్‌లో కనిపిస్తారు. ఈ ట్రైలర్‌లోని సముద్ర లోకాన్ని ఆవిష్కరించినట్టుగా తెలుస్తుంది. అద్ఫుతమై గ్రాఫిక్స్ మాయాజాలం అడుగడుగునా దర్శనమిస్తుంది. 
 

సంబంధిత వార్తలు

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

భర్తను రౌడీషీటర్‌తో హత్య.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.. చివరికి?

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments