సినీ నటి ఖుష్బూపై అట్రాసిటీ కేసు నమోదు చేయండి : వీసీకే

Webdunia
శనివారం, 25 నవంబరు 2023 (12:34 IST)
షెడ్యూల్ తెగలకు చెందిన ప్రజలను కించపరిచేలా మాట్లాడిన సినీ నటి, జాతీయ మహిళా సంఘం సభ్యురాలు ఖుష్బూపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని తమిళనాడు రాష్ట్రంలోని వీసీకే పార్టీ చెన్నై నగర పోలీసులకు ఫిర్యాదు చేసింది. దళితులు మాట్లాడే భాషను ఆమె కించపరిచేలా మాట్లాడారని అందువల్ల ఆమెపై కేసు నమోదు చేయాలని వీసీకే నేతలు డిమాండ్ చేశారు. 
 
మరోవైపు, కాంగ్రెస్ పార్టీ తమిళనాడు శాఖ ఎస్సీ ఎస్టీ విభాగం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విషయంపై ఎస్సీ విభాగం అధ్యక్షుడు రంజన్ కుమార్ మాట్లాడుతూ, దళితులను కించపరిచేలా మాట్లాడిన ఖుష్బూ బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేదంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. 
 
కాగా, సహ నటి త్రిష విషయంలో తీవ్రంగా స్పందించిన ఖుష్బూ... మణిపూర్ మహిళలపై జరిగిన అరాచకాల సమయంలో ఎక్కడున్నారని ప్రశ్నించారు. తాజా వ్యాఖ్యలకు బహిరంగ క్షమాపణ చెప్పకుంటే ఆమె ఇంటిని శుక్రవారం సాయంత్రం ముట్టడిస్తామని హెచ్చరించా. ఈ నేపథ్యంలో పోలీసులు ఆమె ఇంటి వద్ద భారీ భద్రత కల్పించారు. అయితే, ముట్టడి వాయిదా నేపథ్యంలో ఆమె ఇంటికి కల్పించిన భద్రతను వెనక్కి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విడాకులు తీసుకున్న 38 ఏళ్ల మహిళతో 23 ఏళ్ల యువకుడు ఎఫైర్, కొత్త లవర్ రావడంతో...

భర్తతో పిల్లలు కన్నావుగా.. బావకు సంతాన భాగ్యం కల్పించు.. కోడలిపై అత్తామామల ఒత్తిడి

Student: హాస్టల్‌లో విద్యార్థుల మధ్య ఘర్షణ.. తోటి విద్యార్థిని కత్తితో పొడిచిన మరో స్టూడెంట్

మొంథా తుఫాను మృతులకు రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా : సీఎం రేవంత్ రెడ్డి

శ్రీవారి మెట్టు నడకదారిలో చిరుతపులి.. భక్తులు కేకలు.. 800వ మెట్టు దగ్గర..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments