Webdunia - Bharat's app for daily news and videos

Install App

షారూఖ్ పుత్రుడి కేసు.. కీలక సాక్షి గుండెపోటుతో మృతి

Webdunia
శనివారం, 2 ఏప్రియల్ 2022 (21:58 IST)
ముంబై శివారులో గత అక్టోబర్ నెలలో ఓ నౌకలో జరుగుతున్న రేవ్ పార్టీపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు పక్కా సమాచారంతో దాడులు నిర్వహించారు. బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ పట్టుబడటంతో ఈ కేసు సంచలనంగా మారింది.
 
కేసు విచారణ కూడా అంతే సంచలనం అయింది. విచారణ అధికారి సమీర్ వాంఖడేపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఆతర్వాత ఆర్యన్ ఖాన్‌కి బెయిల్ రావడం, కేసు విచారణ కొనసాగడం తెలిసిందే. అయితే ఇప్పుడీ కేసుకి సంబంధించి కీలక సాక్షి సెయిల్ మరణంతో కలకలం రేగింది. 
 
రేవ్ పార్టీపై దాడి చేసిన సమయంలో ఎన్సీబీ అధికారులు, ఆర్యన్ సహా మరికొందరిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రైవేట్ డిటెక్టివ్ కేపీ గోసవిని అప్పట్లో సాక్షిగా పరిగణించింది ఎన్సీబీ. ఆ డిటెక్టివ్ కి బాడీగార్డే ప్రభాకర్ సెయిల్. ప్రభాకర్ ని కూడా సాక్షిగా పేర్కొంది ఎన్సీబీ.
 
ఈ  డ్రగ్స్‌ కేసులో కీలక సాక్షి ప్రభాకర్ సెయిల్‌ మృతి చెందారు. ప్రభాకర్ గుండెపోటుతో మృతి చెందినట్టు అతడి తరఫు న్యాయవాది తుషార్ ఖండారే వెల్లడించారు. 
 
ప్రభాకర్ గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలారని, ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే ఆయన మరణించారని చెప్పారు. ఆయన మృతిపై కుటుంబ సభ్యులు కూడా ఎలాంటి అనుమానం వ్యక్తం చేయలేదని క్లారిటీ ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

NDAతో మా కూటమి 2029 దాటి వెళ్ళబోతోంది.. చంద్రబాబు క్లారిటీ సమాధానం

ఉగ్రవాద నిరోధక ప్యానెల్‌కు పాకిస్థాన్‌కు వైస్ చైర్మన్ పదవా? రాజ్‌నాథ్ సింగ్ సూటి ప్రశ్న

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా అజారుద్దీన్ తనయుడు

NASA: నాసా అధికారిక వెబ్‌సైట్‌లో బగ్‌ను గుర్తించిన 16 ఏళ్ల బాలుడు.. హ్యాట్సాఫ్!

బాలికలకు హాని చేయాలంటేనే భయపడాలి.. తాట తీయండి: చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments