Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలీసులను ఆశ్రయించిన సినీ నటి శ్రీసుధ.. చిక్కుల్లో శ్యామ్ కె నాయుడు

Webdunia
శనివారం, 23 జనవరి 2021 (08:21 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖ సనిమాటోగ్రాఫర్ శ్యామ్ కె నాయుడు చిక్కుల్లో పడ్డారు. ఆయనపై సినీ నటి శ్రీసుధ భీమిరెడ్డి పోలీస్ కేసు పెట్టింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఐదేళ్ళపాటు కాపురం చేసి మోసం చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇపుడు కేసును ఉపసంహరించుకోవాలంటూ పలువురితో కలిసి బెదిరిస్తున్నారంటూ మరోమారు పోలీసులను ఆశ్రయించింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ఐదేళ్లు కలిసున్న తర్వాత ఇప్పుడు కాదంటున్నాడంటూ గతేడాది శ్రీసుధ ఎస్సార్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెల్సిందే. ఇప్పుడీ కేసును వెనక్కి తీసుకోవాలని బెదిరిస్తున్నారంటూ మరోమారు ఎస్సార్ నగర్ పోలీసులను ఆమె ఆశ్రయించారు. 
 
సినీ ఆర్ట్ డైరెక్టర్ చిన్నా మాదాపూర్‌లోని తన నివాసానికి పిలించాడని, స్టిల్ ఫొటోగ్రాఫర్ సాయిరాం మాగంటితో కలిసి కేసును ఉపసంహరించుకోవాలని బెదిరించారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 
 
చిన్నా తనను దూషించాడని పేర్కొన్న శ్రీసుధ.. వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆరోపించారు. శ్రీసుధ ఫిర్యాదుతో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు మాదాపూర్ పోలీస్ స్టేషన్‌కు కేసును బదిలీ చేయనున్నట్టు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Andhra Pradesh: COVID-19 మార్గదర్శకాలను జారీ చేసిన ఏపీ సర్కారు

Chhattisgarh: బసవ రాజుతో సహా 27మంది మావోయిస్టులు మృతి

తిరుమలలో అపచారం: కొండపై నమాజ్ చేసిన వ్యక్తి - వీడియో వైరల్

Jio: ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్‌లో జియో నెట్‌వర్క్‌ ఏర్పాటు

Drum Tower: 650 ఏళ్ల డ్రమ్ టవర్ కూలిపోయింది.. వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments