Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంక్రాంతికి భీమ్లా నాయక్.. ఏపీ సర్కారు షాక్.. ఏమైంది?

Webdunia
బుధవారం, 24 నవంబరు 2021 (16:47 IST)
సంక్రాంతికి భీమ్లా నాయక్ విడుదల కానున్న సంగతి తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సాగర్‌కే చంద్ర తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే మాటలు రాస్తున్నాడు. 
 
ఈ సినిమాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ భార్య‌గా నిత్యా మీనన్ న‌టిస్తోంది. రానా మరో హీరోగా నటిస్తున్నాడు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా పాటలు ఇప్పటికే మంచి విజయం సాధించాయి. ముఖ్యంగా టైటిల్ సాంగ్ పవన్ అభిమానులకు విపరీతంగా నచ్చింది. సాధారణంగా పవన్ కళ్యాణ్ సినిమాలకు 100 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుంది. కానీ భీమ్లా నాయక్ విషయంలో మాత్రం ఇది కనిపించడం లేదు.
 
ఎందుకంటే ప్రస్తుతం ఏపీలో ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని.. టికెట్ రేట్లను పరిగణనలోకి తీసుకొని బిజినెస్ అనుకున్న దాని కంటే కాస్త తక్కువ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.85 కోట్ల రేంజ్‌లోనే జ‌రుగుతుంది. 
 
ప్రస్తుతం ఉన్న టికెట్ల ధ‌ర‌ల‌ కారణంగా రూ.15 కోట్లు తక్కువకే బిజినెస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ సినిమా విడుదల సమయానికి జగన్ ప్రభుత్వం మనసు మార్చుకుని టికెట్ రేట్లు పెంచితే డిస్ట్రిబ్యూటర్లకు అంతకంటే పండగ చేసుకునే విషయం మరొకటి లేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సుంకాలను సున్నా శాతానికి తగ్గించేందుకు భారత్ ఆఫర్ చేసింది : డోనాల్డ్ ట్రంప్

India: వైజాగ్‌లో దేశంలోనే అతిపెద్ద గాజు వంతెన.. స్కైవాక్ టైటానిక్ వ్యూ పాయింట్‌

Pawan Kalyan పవన్ కళ్యాణ్ పుట్టినరోజు.. శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు, అల్లు అర్జున్

పవన్ కళ్యాణ్... ఓ పీపుల్స్ స్టార్ : నారా లోకేశ్

ప్రజల దీవెనలతో నిండు నూరేళ్లూ వర్ధిల్లాలి : పవన్‌కు సీఎం బాబు విషెస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments