చెత్త వేశాడని అనుష్క శర్మ కేకలు-అంతే నెటిజన్లు ఇలా తిట్టిపోస్తున్నారు.. అవసరమా?

బాలీవుడ్ నటి అనుష్క శర్మ, ఆమె భర్త విరాట్ కోహ్లీలపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అనుష్క, విరాట్ కలిసి కారులో వెళ్తుండగా, పక్కనే కారులో వెళ్తున్న అర్హాన్‌ సింగ్‌ అనే వ్యక్తి ప్లాస్టిక్‌ క

Webdunia
సోమవారం, 18 జూన్ 2018 (15:01 IST)
బాలీవుడ్ నటి అనుష్క శర్మ, ఆమె భర్త విరాట్ కోహ్లీలపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అనుష్క, విరాట్ కలిసి కారులో వెళ్తుండగా, పక్కనే కారులో వెళ్తున్న అర్హాన్‌ సింగ్‌ అనే వ్యక్తి ప్లాస్టిక్‌ కవరును రోడ్డుపై పడేశాడు. అది గమనించిన అనుష్క కారు ఆపి మరీ అతనిపై మండిపడింది. రోడ్డుపై ఎందుకు ప్లాస్టిక్ వేస్తున్నారు. డస్ట్‌బిన్ ఉపయోగించమని కేకలు పెట్టింది. 
 
అనుష్క అర్హాన్ సింగ్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన వీడియోను విరాట్ కోహ్లీ ట్విట్టర్లో పోస్టు చేశాడు. వీళ్లా దేశాన్ని పరిశుభ్రంగా ఉంచేది? ఎవరైనా చెత్త పడేయడం చూసినప్పుడు మీరూ ఇలానే వారిని ప్రశ్నించండి. అవగాహన కల్పించండంటూ పిలుపునిచ్చాడు. 
 
అయితే ఆ పిమ్మట అర్హాన్ సింగ్ ఫేస్‌బుక్ ద్వారా క్షమాపణలు చెప్పాడు. కానీ అనుష్క, విరాట్‌ తన పట్ల ప్రవర్తించిన తీరును విమర్శించారు. తాను  రోడ్డుపై పడేసిన చెత్త కంటే అనుష్క నోట్లో నుంచి వచ్చిన చెత్తే ఎక్కువగా ఉంది. సెలబ్రిటీ అయివుండి రోడ్డున పోయే వ్యక్తిలాగా కేకలు పెట్టిందని మండిపడ్డాడు. అర్హాన్ తల్లి కూడా తన కుమారుడి పట్ల అనుష్క శర్మ కేకలు పెట్టడం సబబు కాదని తెలిపింది.
 
అంతేగాకుండా నెటిజన్లు కూడా అనుష్క శర్మపై మండిపడుతున్నారు. మైదానంలో నోటికొచ్చినట్లు తిట్టే భర్తను కూడా కంట్రోల్‌లో పెట్టమని సూచిస్తున్నారు. చెత్తపడేశాడని అనుష్క తిట్టడంలో తప్పులేదు. కానీ ఆ వ్యక్తి వివరాలు షేర్‌ చేయాల్సిన అవసరం ఏముందని మండిపడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ నెయ్యి కేసు: తితిదే జీఎం కె సుబ్రహ్మణ్యం అరెస్ట్, వైవీ సుబ్బారెడ్డిని కూడానా?

సైక్లోన్ దిత్వా వచ్చేస్తోంది.. తమిళనాడులో భారీ వర్షాలు.. శనివారం నాటికి..

కేటీఆర్ ఐరన్ లెగ్.. అందుకే కవిత పార్టీ నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది.. కడియం శ్రీహరి

మైండ్‌లెస్ మాటలు మాట్లాడేవారు ఉపముఖ్యమంత్రులవుతున్నారు: జగదీష్ రెడ్డి (video)

ఆరోగ్యానికే కాదు.. పెళ్ళిళ్లకు కూడా ఇన్సూరెన్స్.... ఎట్టెట్టా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments