Webdunia - Bharat's app for daily news and videos

Install App

మన్మథుడుకి "కంపెనీ" ఇవ్వనున్న దేవసేన

తెలుగు చిత్రపరిశ్రమలో సరికొత్త ట్రెండ్‌ను సృష్టించిన చిత్రం "శివ". ఈ చిత్ర కాంబినేషన్ 28 యేళ్ళ తర్వాత మళ్లీ రిపీట్ అవుతోంది. వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ - హీరో నాగార్జున కాంబినేషన్‌లో ఓ చిత్రం

Webdunia
శనివారం, 25 నవంబరు 2017 (15:02 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో సరికొత్త ట్రెండ్‌ను సృష్టించిన చిత్రం "శివ". ఈ చిత్ర కాంబినేషన్ 28 యేళ్ళ తర్వాత మళ్లీ రిపీట్ అవుతోంది. వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ - హీరో నాగార్జున కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రానికి 'కంపెనీ' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు కూడా ఇటీవల ప్రారంభమయ్యాయి. 
 
అయితే, హీరోయిన్‌తో పాటు ఇతర సాంకేతికవర్గం, నటీటుల ఎంపిక ఇంకా పూర్తికాలేదు. కానీ, హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లో ఓ న్యూస్ హైదరాబాద్‌లో చక్కర్లు కొడుతోంది. టాలీవుడ్ మన్మథుడు సరసన హీరోయిన్‌గా దేవసేన అనుష్కను ఎంపిక చేయనున్నారనే వార్త వైరల్‌గా మారింది. అదే నిజమైతే ‘బాహుబలి’ తర్వాత ఆమె కమిట్‌ అయ్యే సినిమా ఇదే అవుతుంది. 
 
మరోవైపు, నాగార్జున పోలీస్‌ ఆఫీసర్‌గా నటిస్తున్న ఈ సినిమా టెక్నికల్‌గా కూడా హై స్టాండర్డ్స్‌లో ఉండేందుకు ఆయన కృషి చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతుంది. తదుపరి షెడ్యూల్‌ ముంబైలో ఉంటుంది. ఈ సినిమాలో డ్యూయెట్లు కానీ, లవ్‌ సీన్లు కానీ ఉండవని అంటున్నారు. అయితే ఓ ఐటెం సాంగ్‌ మాత్రం ఉంటుందని చెబుతున్నారు. హీరోయిన్‌కు నాగార్జునతో లవ్‌ ట్రాక్‌ ఉండదని యూనిట్‌ వర్గాలు వెల్లడించాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మేఘాలయ హనీమూన్ కేసు: నా సోదరి తప్పు చేసింది, మరణశిక్ష విధించాలి (video)

జగన్ - భారతి వల్లే ఈ దరిద్రమంతా : ఆదినారాయణ రెడ్డి

కాంగ్రెస్ పార్టీని చీల్చేందుకు మోడీ సర్కారు కుట్ర : మల్లికార్జున ఖర్గే

దోషి అని తేలితే ఉరి తీయండి.. సోనమ్ సోదరుడు

మహిళలు గౌరవంగా, ఆరోగ్యంగా జీవించాలనేది నా కోరిక : ఉపాస‌న కామినేని కొణిదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

తర్వాతి కథనం
Show comments