Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవికి ఊరట : ఎన్నికల కేసు కొట్టేసిన హైకోర్టు

Webdunia
బుధవారం, 26 జులై 2023 (12:10 IST)
మెగాస్టార్ చిరంజీవి ఒకపుడు రాజకీయ నేత. ఆయన కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రిగా కూడా పని చేశారు. అయితే, ఆయనకు ఇపుడు పెద్ద ఊరట లభించింది. ఆయన గత 2014 ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ ఉత్తర్వులకు విరుద్ధంగా ప్రచారాన్ని రాత్రి 10 గంటల తర్వాత నిర్వహించారని, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారనే ఆరోపణలతో గుంటూరులోని అరండల్ పేట్ పోలీస్ స్టేషన్‌లో ఒక కేసు నమోదైంది.
 
ఈ కేసు ఎఫ్ఎస్ఐఆర్ ఆధారంగా గుంటూరు రైల్వే కోర్టులో జరుగుతున్న విచారణను హైకోర్టు నిలిపివేసింది. పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు ఈ కేసుకు చెల్లుబాటుకావని స్పష్టం చేసింది. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు. జరిమానా విధించాలన్న సహాయ పీపీ వాదనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. 
 
2014 ఏప్రిల్ 27వ తేదీ రాత్రి 10 గంటల తర్వాత ఎన్నికల ప్రచారం చేశారని, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారని పేర్కొంటూ చిరంజీవిపై పోలీసులు అప్పట్లో కేసు నమోదు చేశారు. పిటిషనర్ తరపున న్యాయవాది ఎ.స్వరూపా రెడ్డి వాదనలు వినిపించారు. ప్రచారం ముగించుకొని తిరిగి వస్తున్న పిటిషనర్‌పై అక్రమంగా కేసు నమోదు చేశారన్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగలేదన్నారు. ఆ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. చిరంజీవిపై నమోదు చేసిన కేసును కొట్టేస్తూ ఉత్తర్వులిచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ది గోల్కొండ బ్లూ- అరుదైన నీలి వజ్రం- మే 14న జెనీవాలో వేలానికి సిద్ధం (video)

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలుగు విద్యార్థిని పరిస్థితి విషమం

తిరుగుబాటు చట్టాలను అమలు చేయనున్న డోనాల్డ్ ట్రంప్ - 20న ఆదేశాలు జారీ!

అయ్యప్ప భక్తులకు శుభవార్త - ఇకపై బంగారు లాకెట్ల విక్రయం

వీరాభిమానికి స్వయంగా పాదరక్షలు తొడిగిన నరేంద్ర మోడీ!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments