Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవికి ఊరట : ఎన్నికల కేసు కొట్టేసిన హైకోర్టు

Webdunia
బుధవారం, 26 జులై 2023 (12:10 IST)
మెగాస్టార్ చిరంజీవి ఒకపుడు రాజకీయ నేత. ఆయన కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రిగా కూడా పని చేశారు. అయితే, ఆయనకు ఇపుడు పెద్ద ఊరట లభించింది. ఆయన గత 2014 ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ ఉత్తర్వులకు విరుద్ధంగా ప్రచారాన్ని రాత్రి 10 గంటల తర్వాత నిర్వహించారని, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారనే ఆరోపణలతో గుంటూరులోని అరండల్ పేట్ పోలీస్ స్టేషన్‌లో ఒక కేసు నమోదైంది.
 
ఈ కేసు ఎఫ్ఎస్ఐఆర్ ఆధారంగా గుంటూరు రైల్వే కోర్టులో జరుగుతున్న విచారణను హైకోర్టు నిలిపివేసింది. పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు ఈ కేసుకు చెల్లుబాటుకావని స్పష్టం చేసింది. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు. జరిమానా విధించాలన్న సహాయ పీపీ వాదనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. 
 
2014 ఏప్రిల్ 27వ తేదీ రాత్రి 10 గంటల తర్వాత ఎన్నికల ప్రచారం చేశారని, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారని పేర్కొంటూ చిరంజీవిపై పోలీసులు అప్పట్లో కేసు నమోదు చేశారు. పిటిషనర్ తరపున న్యాయవాది ఎ.స్వరూపా రెడ్డి వాదనలు వినిపించారు. ప్రచారం ముగించుకొని తిరిగి వస్తున్న పిటిషనర్‌పై అక్రమంగా కేసు నమోదు చేశారన్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగలేదన్నారు. ఆ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. చిరంజీవిపై నమోదు చేసిన కేసును కొట్టేస్తూ ఉత్తర్వులిచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యాభర్తల మధ్య గొడవ.. మద్యం మత్తులో కుమార్తె గొంతుకోసి...

యాంకర్ స్వేచ్ఛతో సన్నిహిత సంబంధం నిజమే... : పూర్ణచందర్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం : సీఎం చంద్రబాబు

పుల్లెల గోపీచంద్ అకాడమీలో తమ సరికొత్త క్లినిక్‌ను ప్రారంభించిన వెల్నెస్ కో

ప్రియురాలుని బైక్ ట్యాంక్ పైన పడుకోబెట్టి వేగంగా నడుపుతూ యువకుడు రొమాన్స్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments