Webdunia - Bharat's app for daily news and videos

Install App

అడ్వర్టైజ్‌మెంట్‌ వివాదంలో సుమక్క... లబోదిబోమంటున్న ఇన్వెస్టర్లు

సెల్వి
శుక్రవారం, 9 ఆగస్టు 2024 (15:47 IST)
స్టార్‌ యాంకర్‌ సుమ కనకాల వివాదంలో చిక్కారు. ఆమె చేసిన అడ్వర్టైజ్‌మెంట్‌ వివాదంలోకి నెట్టేసింది. అడ్వర్టైజ్‌మెంట్‌ చేయించుకున్న సంస్థ బోర్డు తిప్పేయడంతో పెట్టుబడిదారులు లబోదిబోమంటున్నారు. 
 
యాంకర్‌ సుమ చెప్పడంతోనే తాము పెట్టుబడులు పెట్టామని.. సుమ తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్‌ చేస్తుండడం కలకలం రేపింది. సుమక్క చెప్పడంతోనే తాము ప్లాట్లు కొన్నామని.. ఇప్పుడు తీవ్రంగా నష్టపోయామని బాధితులు వాపోతున్నారు. రాకీ అవెన్యూస్ అనే రియల్‌ ఎస్టేట్‌ సంస్థకు ఆమె ప్రచారం చేశారు.
 
అయితే ఆ సంస్థ తాజాగా బోర్డు తిప్పేసింది. తక్కువ ధరకు ప్లాట్లు ఇస్తామని ప్రచారం చేయడం, పెద్ద ఎత్తున స్పందన రావడంతో దాదాపు రూ.88 కోట్ల మేర పెట్టుబడులు వచ్చాయి. అయితే డబ్బులు తీసుకున్న సంస్థ ఇప్పుడు బోర్డు తిప్పేసింది.
 
తమకు న్యాయం చేయాలంటూ పోలీసులతో పాటు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ క్రమంలో సంస్థకు ప్రచారం చేసిన సుమ కూడా స్పందించాలని కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Chandrababu: భారత్-పాక్ కాల్పుల విరమణ.. ఏపీ సీఎం చంద్రబాబు హర్షం

శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో వంద గ్రాముల బంగారం దోపిడీ

Nipah: మలప్పురం జిల్లాలో నిఫా వైరస్.. ఆ ఎనిమిది మందికి సోకలేదు..

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. మోదీ కూడా చెప్పేశారు.. వార్ ఇకలేదు

Hyderabad: శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం- హైదరాబాదులో హై అలెర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments