'కిల్లింగ్ వీరప్పన్'లాంటి సూపర్హిట్ చిత్రాన్ని నిర్మించి, తాజాగా విశాల్ నటించిన 'కథకళి' చిత్రాన్ని తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో విడుదల చేసిన శ్రీకృష్ణ క్రియేషన్స్ అధినేత గౌరీకృష్ణ తాజాగా రష్మి ప్రధాన పాత్రలో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నూతన దర్శకుడు జానిని పరిచయం చేస్తూ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత గౌరీకృష్ణ మాట్లాడుతూ... 'జబర్దస్త్' యాంకర్గా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న రష్మి ప్రధాన పాత్రలో ఓ హర్రర్ చిత్రంగా రూపొందిస్తున్నాం.
ఇప్పటివరకు 50 శాతం షూటింగ్ పూర్తయింది. త్వరలో మిగతా పార్ట్ పూర్తిచేసి జూన్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఇప్పటి వరకు వచ్చిన అవుట్పుట్ చూశాక సినిమా పట్ల చాలా కాన్ఫిడెంట్గా వున్నాం. అన్ని ఏరియాల్లో బిజినెస్పరంగా రెస్పాన్స్ బాగుంది' అన్నారు,