జబర్దస్త్ షోతో పాపులర్ అయిన సుడిగాలి సుధీర్ వెండితెరపై హాస్యనటుడిగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఓ టీవీ నిర్వహించిన కార్యక్రమానికి టీమ్ లీడర్లుగా సుడిగాలి సుధీర్, రష్మీ వ్యవహరించారు. ఇక ఈ కార్యక
జబర్దస్త్ షో ఎంత వినోదాన్ని పంచుతుందో.. అంతగా వివాదాస్పదమవుతోంది. ఈ షోలో పాల్గొన్న కమెడియన్లు ప్రస్తుతం సినిమాల్లో నటిస్తున్నారు. అలా జబర్దస్త్ షోతో పాపులర్ అయిన సుడిగాలి సుధీర్ వెండితెరపై హాస్యనటుడిగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఓ టీవీ నిర్వహించిన కార్యక్రమానికి టీమ్ లీడర్లుగా సుడిగాలి సుధీర్, రష్మీ వ్యవహరించారు. ఇక ఈ కార్యక్రమానికి యాంకర్గా ప్రదీప్ వ్యవహరిస్తున్నాడు. ఇంతకీ అదేం ప్రోగ్రామ్ అంటే.. ఈటీవీ వారికి చెందిన కార్యక్రమమే.
ఈ నేపథ్యంలో.. ఢీ షోలో సుధీర్ సమయం సందర్భం లేకుండా వేస్తుండటమే కాకుండా.. యాంకర్ ప్రదీప్పై కూడా ఓ కుళ్ళు జోకు వేశాడు. కానీ ప్రదీప్ దానిని లైట్గా తీసుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ ప్రదీప్ యాంకరింగ్ చేస్తుండగా సుధీర్ ఎప్పటిలాగానే పంచ్ వేసే ప్రయత్నం చేశాడు. దీంతో ప్రదీప్ సహనం కోల్పోయి సుధీర్కు తన కాలి బూట్ను చూపించే ప్రయత్నం చేశాడు. కానీ ఇదంతా షోలోనే భాగమేనని.. ఈ షో చూసిన ప్రేక్షకులు అంటుంటే.. కొందరు మాత్రం సుధీర్కు ప్రదీప్ కావాలనే చెప్పుచూపింటాడని అంటున్నారు. మరి దీంట్లో ఏది నిజమో?!