Webdunia - Bharat's app for daily news and videos

Install App

'దొరసాని' రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది!

Webdunia
గురువారం, 27 జూన్ 2019 (13:15 IST)
అటు సినీ పరిశ్రమలోనూ, ఇటు ప్రేక్షకులలోనూ తీవ్ర ఆసక్తిని రేకెత్తించిన 'దొరసాని' జులై 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా, రాజశేఖర్ జీవితల కుమార్తె శివాత్మిక హీరోయిన్‌గా పరిచయం అవుతూ... మధుర ఎంటర్‌టైన్‌మెంట్స్, బిగ్ బెన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా నిర్మాణ అనంతర కార్యక్రమాలను పూర్తిచేసుకొని గ్రాండ్ రిలీజ్‌కి సిద్దం అవుతోంది. ఈ చిత్రానికి దర్శకుడిగా కె.వి.ఆర్ మహేంద్ర పరిచయం అవుతున్నాడు.
 
80వ దశకంలో తెలంగాణా ప్రాంతంలో జరిగిన ఒక స్వచ్ఛమైన ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా... టీజర్ ఇప్పటికే రిలీజ్ కాగా.. 'నింగిలోన పాలపుంత నవ్వులొంపెనే' పాట దొరసానిపై అంచనాలను పెంచాయి. మరోపాట 'కలవరమై.. కలవరమై' ఈనెల 24న రిలీజ్ కానుంది. కల్మషం లేని ప్రేమకథగా తెరకెక్కిన ‘దొరసాని’ ప్రేమకథలలో ప్రత్యేకస్థానంలో నిలుస్తుందంటున్నారు దర్శక నిర్మాతలు. మరి ఈ దొరసాని వారి ఆశలను ఎంత మేరకు నెరవేర్చుతుందో వేచి చూద్దాం. 

సంబంధిత వార్తలు

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

భర్తను రౌడీషీటర్‌తో హత్య.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.. చివరికి?

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments