Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ అందరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.. అమితాబ్

Webdunia
మంగళవారం, 14 జులై 2020 (10:13 IST)
కరోనా మహమ్మారి దేశ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. కరోనా అంటేనే జనం వణికిపోతున్నారు. తాజాగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఆయన తనయుడు అభిషేక్, కోడలు ఐష్‌, మనవరాలు ఆరాధ్య కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అభిషేక్, అమితాబ్ నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, ఐష్‌, ఆరాధ్య ఇంటివద్దే జాగ్రతలు తీసుకుంటూ మందులు వాడుతున్నారు.
 
75 ఏళ్ళ అమితాబ్‌కి కాలేయ, ఉదర సంబంధిత వ్యాధులు ఉండగా, ఆయన ఆరోగ్యంపై అభిమానులలో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో బిగ్ బీ ప్రతి రోజు తన హెల్త్ అప్‌డేట్ ఇస్తూనే ఉన్నారు. అమితాబ్ క్షేమంగా తిరిగి రావాలని మనదేశంలోనే కాదు విదేశానికి చెందిన అభిమానులు, ప్రముఖులు కూడా ప్రార్ధిస్తున్నారు. కొందరు యాగాలు చేస్తున్నారు. 
 
తనపై ఇంత ప్రేమని కురిపించడం చూసి బిగ్ బీ ఎమోషనల్ అవుతూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో నమస్కరిస్తున్న ఫోటో ఒకటి పెట్టి పోస్ట్ పెట్టారు. ఇందులో మీ ప్రార్ధనలు, శుభాకాంక్షలకి నా ధన్యవాదాలు.. మీ కుండపోత ప్రేమకు మీ అందరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అని అమితాబ్ కామెంట్స్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోలీసుల బట్టలు ఊడదీసి నిలబెడతానన్న జగన్: అరటి తొక్క కాదు ఊడదీయడానికి...

అనన్ త పద్ చాయే ట్రెండ్ సాంగ్‌కు డ్యాన్స్ చేసిన తమిళ విద్యార్థులు (video)

ప్రకాశం బ్యారేజ్‌లో దూకేసిన మహిళ - కాపాడిన ఎన్డీఆర్ఎఫ్.. శభాష్ అంటూ కితాబు (video)

తెలంగాణ జిల్లాలకు ఎల్లో అండ్ ఆరెంజ్ అలెర్ట్.. భారీ వర్షాలకు అవకాశం

కోలుకుంటున్న డిప్యూటీ సీఎం పవన్ కుమారుడు మార్క్ శంకర్ (photo)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments