Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైదానంలో ఆ ఫ్లయింగ్‌ కిస్‌ల గోలేంటి.. ఎర్రబడిన అనుష్క మొహం

భారత క్రికెట్ జట్టు సారథి విరాట్ కోహ్లీ సతీమణి, బాలీవుడ్ నటి అనుష్క శర్మ మొహం ఎర్రబడిపోయింది. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ అడిగిన ప్రశ్నతో ఆమెకు దిమ్మతిరిగిపోయింది. దీంతో ఆమె ముఖం ఎర్రబడిపోయిం

Webdunia
ఆదివారం, 23 సెప్టెంబరు 2018 (11:52 IST)
భారత క్రికెట్ జట్టు సారథి విరాట్ కోహ్లీ సతీమణి, బాలీవుడ్ నటి అనుష్క శర్మ మొహం ఎర్రబడిపోయింది. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ అడిగిన ప్రశ్నతో ఆమెకు దిమ్మతిరిగిపోయింది. దీంతో ఆమె ముఖం ఎర్రబడిపోయింది. ఆ తర్వాత తేరుకుని సిగ్గుతో సమాధానం చెప్పింది.
 
గత యేడాది డిసెంబరు నెలలో దేశంలో జరిగిన అతిపెద్ద ఈవెంట్లలో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ వివాహం ఒకటి. ఇద్దరూ కూడా వారివారి రంగాల్లో బిజీగా ఉంటున్నప్పటికీ... తన భర్తను ఇంటా, బయటా కూడా మిస్ కాకుండా అనుష్క చూసుకుంటోంది. దాదాపు ప్రతి మ్యాచ్‌కు అనుష్క హాజరవుతోంది. 
 
విదేశాల్లో మ్యాచ్ జరిగే సమయంలో కూడా ఆమె అక్కడకు వెళ్తోంది. మ్యాచ్‌ల సందర్భంగా గ్యాలరీలో కూర్చొని తన భర్తను ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. మరోవైపు కోహ్లీ కూడా ఏదైనా సాధించినప్పుడు గ్రౌండ్ నుంచి తన భార్యకు ఫ్లైయింగ్ కిస్‌లు విసురుతుంటాడు. ఈ నేపథ్యంలో అనుష్కను బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఆటపట్టించారు. 
 
కౌన్‌బనేగా కరోడ్ పతి కార్యక్రమానికి సామాజిక కార్యకర్త సుధా వర్గీస్‌తో పాటు అనుష్క వచ్చింది. ఈ సందర్భంగా ఈ ఫ్లయింగ్ కిస్‌ల గురించి అమితాబ్ ప్రశ్నించగా... అనుష్క మొహం సిగ్గుతో ఎరుపెక్కింది. అయితే, సమాధానాన్ని కూడా అంతే కొంటెగా చెప్పింది. తాను కోహ్లీ కోసమే క్రికెట్‌ను చూడనని... దేశం కోసం చూస్తానని తెలివిగా సమాధానం ఇచ్చింది. దీంతో అక్కడ నవ్వులు విరబూశాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Stree Shakti: మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించిన సీఎం చంద్రబాబు, పవన్, నారా లోకేష్ (video)

ఏపీ అసెంబ్లీ భవనంలో రూ.1.5 కోట్ల వ్యయంతో హై-స్పీడ్ ప్రింటింగ్ యంత్రాలు

Banakacherla: గోదావరి-బనకచెర్ల ప్రాజెక్టును సమర్థించిన ఏపీ చంద్రబాబు

PM Modi: 103 నిమిషాల స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం.. రికార్డ్ బ్రేక్

leopard: తల్లిదండ్రులతో నిద్రస్తున్న మూడేళ్ల చిన్నారిని లాక్కెళ్లిన చిరుత.. ఆ తర్వాత ఏమైందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

తర్వాతి కథనం
Show comments