Webdunia - Bharat's app for daily news and videos

Install App

పైరసీ వీడియోలు అమ్మాను.. వంగవీటి ఆడియోకు నాగార్జున, అమితాబ్.. వర్మ

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలనాలకు పెట్టింది పేరు. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో రామ్ గోపాల్ వర్మ ముందుంటారు. తాను ఇంజినీరింగ్‌ ఫెయిల్‌ తర్వాత పైరసీ వీడియోలు అమ్మడం మొదలుపెట్టానని చెప్పుకొచ్చారు.

Webdunia
ఆదివారం, 11 డిశెంబరు 2016 (12:29 IST)
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలనాలకు పెట్టింది పేరు. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో రామ్ గోపాల్ వర్మ ముందుంటారు. తాను ఇంజినీరింగ్‌ ఫెయిల్‌ తర్వాత పైరసీ వీడియోలు అమ్మడం మొదలుపెట్టానని చెప్పుకొచ్చారు. బాలీవుడ్ మెగా బీ అమితాబ్‌ బచ్చన్‌ 'ఆఖరి రాస్తా' సినిమా పైరసీ వీడియోలు కూడా అమ్మానని, ఇప్పుడు ఆయనతోనే 'సర్కార్‌ 3' తీస్తున్నానని ట్విట్టర్లో పేర్కొన్నారు. అమితాబ్‌ బచ్చన్‌‌తో వర్మ ఇంతకుముందు సర్కార్‌, డర్నా జరూరీ హై, నిశ్శబ్ద్‌, ఆగ్, సర్కార్‌ రాజ్‌, రణ్‌, డిపార్ట్‌ మెంట్‌, టైమ్‌ మెషీన్‌ సినిమాలు తీశారు. 
 
కాగా, రామ్‌గోపాల్‌ వర్మ తాజా చిత్రం 'వంగవీటి' ప్రీ-రిలీజ్‌ ఫంక్షన్‌కి అమితాబ్‌ బచ్చన్, నాగార్జున ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. ఈ నెల 20న 'శివ టు వంగవీటి' పేరుతో హైదరాబాద్‌లో ఈ ఫంక్షన్‌ నిర్వహించనున్నారు. వంగవీటి సినిమాపై హైప్ తీసుకురావడానికి వర్మ తెలివిగా తన సినిమా జర్నీ పేరుతో.. బాలీవుడ్, టాలీవుడ్ టాప్ హీరోలతో ఒక కార్యక్రమం నిర్వహించి ‘వంగవీటి’ని మళ్లీ వార్తల్లో నిలపాలని ప్రయత్నిస్తున్నట్లు టాలీవుడ్ జనం చెప్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

జగన్ బ్యాచ్ అంతా ఒకే గూటి పక్షులా?... విజయవాడ జైలులో ఒకే బ్యారక్‌‌లోనే...

పాకిస్థాన్‌కు ఎమ్మెల్యే మద్దతు.. బొక్కలో పడేసిన పోలీసులు.. ఎక్కడ?

Love Story: మహిళకు షాకిచ్చిన యువకుడు.. చివరికి జైలులో చిప్పకూడు

అక్రమ సంబంధం బయటపడుతుందని ప్రియుడితో జతకట్టి భర్తను మట్టుబెట్టిన భార్య!!

పోప్ నివాళి కోసం వాటికన్ సిటీకి వెళ్లిన రాష్ట్రపతి బృందం!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments