పైరసీ వీడియోలు అమ్మాను.. వంగవీటి ఆడియోకు నాగార్జున, అమితాబ్.. వర్మ

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలనాలకు పెట్టింది పేరు. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో రామ్ గోపాల్ వర్మ ముందుంటారు. తాను ఇంజినీరింగ్‌ ఫెయిల్‌ తర్వాత పైరసీ వీడియోలు అమ్మడం మొదలుపెట్టానని చెప్పుకొచ్చారు.

Webdunia
ఆదివారం, 11 డిశెంబరు 2016 (12:29 IST)
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలనాలకు పెట్టింది పేరు. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో రామ్ గోపాల్ వర్మ ముందుంటారు. తాను ఇంజినీరింగ్‌ ఫెయిల్‌ తర్వాత పైరసీ వీడియోలు అమ్మడం మొదలుపెట్టానని చెప్పుకొచ్చారు. బాలీవుడ్ మెగా బీ అమితాబ్‌ బచ్చన్‌ 'ఆఖరి రాస్తా' సినిమా పైరసీ వీడియోలు కూడా అమ్మానని, ఇప్పుడు ఆయనతోనే 'సర్కార్‌ 3' తీస్తున్నానని ట్విట్టర్లో పేర్కొన్నారు. అమితాబ్‌ బచ్చన్‌‌తో వర్మ ఇంతకుముందు సర్కార్‌, డర్నా జరూరీ హై, నిశ్శబ్ద్‌, ఆగ్, సర్కార్‌ రాజ్‌, రణ్‌, డిపార్ట్‌ మెంట్‌, టైమ్‌ మెషీన్‌ సినిమాలు తీశారు. 
 
కాగా, రామ్‌గోపాల్‌ వర్మ తాజా చిత్రం 'వంగవీటి' ప్రీ-రిలీజ్‌ ఫంక్షన్‌కి అమితాబ్‌ బచ్చన్, నాగార్జున ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. ఈ నెల 20న 'శివ టు వంగవీటి' పేరుతో హైదరాబాద్‌లో ఈ ఫంక్షన్‌ నిర్వహించనున్నారు. వంగవీటి సినిమాపై హైప్ తీసుకురావడానికి వర్మ తెలివిగా తన సినిమా జర్నీ పేరుతో.. బాలీవుడ్, టాలీవుడ్ టాప్ హీరోలతో ఒక కార్యక్రమం నిర్వహించి ‘వంగవీటి’ని మళ్లీ వార్తల్లో నిలపాలని ప్రయత్నిస్తున్నట్లు టాలీవుడ్ జనం చెప్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

దేవుడుకి విశ్రాంతి లేకుండా చేస్తారా? సుప్రీంకోర్టు అసహనం

కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్వగృహంలో మహాపడి పూజ (video)

Nitish Kumar, ముస్లిం మహిళ హిజాబ్‌ను ముఖం నుంచి లాగి వివాదంలో బీహార్ సీఎం నితీష్ కుమార్ (video)

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగ.. గోదావరి జిల్లాల్లో కోడి పందేల కోసం అంతా సిద్ధం

నల్లగా ఉందని భర్త... అశుభాలు జరుగుతున్నాయని అత్తామామలు.. ఇంటి నుంచి గెంటేశారు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ధ్యానంలోకి మరింత లోతుగా ఎలా వెళ్లాలి?: గురుదేవ్ శ్రీ శ్రీ రవి శంకర్

అప్పుడప్పుడు కాస్త పచ్చికొబ్బరి కూడా తింటుండాలి, ఎందుకంటే?

రాత్రిపూట ఇవి తింటున్నారా? ఐతే తెలుసుకోవాల్సిందే

సీజనల్ ఫ్రూట్ రేగు పండ్లు తింటే ప్రయోజనాలు ఏమిటి?

అధునాతన క్యాన్సర్ చికిత్సకై టాటా మెమోరియల్ ఎసిటిఆర్ఇసితో కోటక్ మహీంద్రా భాగస్వామ్యం

తర్వాతి కథనం
Show comments