కరుణానిధిగా ప్రకాష్ రాజ్.. ఎంజీఆర్‌గా అరవింద్ సామి.. అమ్మగా కంగనా

Webdunia
గురువారం, 10 అక్టోబరు 2019 (11:16 IST)
తమిళనాడు మాజీ సీఎం జయలలిత బయోపిక్‌లో కంగనా రనౌత్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు ఏఎల్‌ విజయ్‌ 'తలైవి' అనే పేరిట తెరకెక్కిస్తున్నాడు. ఈ పాత్రకు సంబంధించి ఇటీవల మోల్డ్‌ కూడా తీశారు. జయలలిత పాత్రలో పరకాయం ప్రవేశం చేసే దిశగా శిక్షణ పొందుతోంది కంగనా. ఇక ఎంజీఆర్‌ పాత్రలో అరవింద్‌స్వామి నటించనున్నట్లు కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. 
 
తాజాగా కరుణానిధి పాత్రలో ప్రకాశ్‌రాజ్‌ నటించనున్నట్లు ప్రచారం సాగుతోంది. గతంలో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన 'ఇరువర్‌' చిత్రంలో ప్రకాశ్‌రాజ్‌ నటించారు. ఇది ఎంజీఆర్‌, కరుణానిధిల కథ అని ప్రేక్షకులు చెబుతుండగా.. చిత్రవర్గాలు మాత్రం అధికారికంగా ప్రకటించ లేదు. అందులో కరుణానిధి పాత్రలోనే ప్రకాశ్‌రాజ్‌ కనిపించారు. ఈ నేపథ్యంలో 22 సంవత్సరాల తర్వాత కరుణానిధి పాత్రలో ప్రకాశ్‌రాజ్‌ నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
 
ఇకపోతే జయలలిత పాత్రలో నటిస్తున్న కంగనా రనౌత్.. జయలలితకు సంబంధించిన పుస్తకాలను చదువుతోంది. ఈ సినిమా గురించి కంగనా మాట్లాడుతూ..''జయలలిత నటించిన సినిమాలన్నింటినీ చూస్తున్నా. అలాగే రాజకీయ వేదికలపై ఆమె ప్రసంగం వంటి పలు వీడియోలను కూడా చూసి ఆమె హావభావాలను గమనిస్తున్నా. మొత్తానికి జయలలిత బాడీలాంగ్వేజ్‌ను వీటి ద్వారా నేర్చుకుంటున్నా. ఈ సినిమాలో అసలైన జయలలితను తప్పకుండా చూస్తారని'' పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లి వయసు రాకున్నా సహజీవనం తప్పుకాదు: హైకోర్టు సంచలన తీర్పు

పిల్లలూ... మీకు ఒక్కొక్కళ్లకి 1000 మంది తాలూకు శక్తి వుండాలి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

బలమైన మిత్రుడు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భారత ప్రధాని మోడి, కీలక ఒప్పందాలు

అసలే చలి.. నాలుగు రోజుల్లో 5.89 లక్షల బీరు కేసులు కుమ్మేసిన మందుబాబులు

జనం మధ్యకి తోడేలుకుక్కలు వచ్చేసాయా? యూసఫ్‌గూడలో బాలుడిపై వీధి కుక్క దాడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం కోసం రాగిజావ

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

తర్వాతి కథనం
Show comments