అల్లు అర్జున్‌కు లీగల్‌ నోటీసులు... ఆర్టీసీ బ‌స్సుల‌ను దోసెల‌తో పోల్చడమా?

Webdunia
మంగళవారం, 9 నవంబరు 2021 (22:05 IST)
టీఎస్‌ఆర్టీసీని కించపరిచేవిధంగా హీరో అల్లు అర్జున్‌, ర్యాపిడో సంస్థ తీసిన యాడ్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. నటుడు అల్లు అర్జున్ నటించిన రాపిడో ప్రకటనపై అభ్యంతరం ఆర్టీసీ ఎండీ అభ్యంతరం వ్యక్తం చేశారు. 
 
యూట్యూబ్‌లో ప్రసారం అవుతున్న ప్రకటనలో ఆర్టీసీ బస్సులు సాధారణ దోసెల మాదిరిగానే ఎక్కువ సమయం తీసుకుంటాయని, రాపిడో చాలా వేగంగా, సురక్షితంగా ఉంటుందని, అదే సమయంలో మసాలా దోసను సిద్ధం చేస్తుందని అల్లు అర్జున్ ప్రజలకు చెప్పడం సరికాదని అన్నారు.
 
ఈ ప్రకటనపై ఆర్టీసీ ప్రయాణీకులు, అభిమానులు, సంస్థ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులతో సహా అనేక వ్యక్తుల నుండి పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు. ర్యాపిడో సర్వీసులతో పోల్చి ఆర్టీసీ బస్సులను ప్రతికూలంగా చూపించడాన్ని ఖండిస్తున్నామని ఆయన అన్నారు.
 
ప్ర‌జా ర‌వాణాను ప్రోత్స‌హించే ప్ర‌క‌ట‌న‌ల్లో న‌టులు న‌టించాల‌ని స‌జ్జ‌నార్ సూచించారు. టీఎస్‌ ఆర్టీసీ సామాన్యుల సేవలో ఉంది… అందుకే నటుడికి, ప్రకటనను ప్రచారం చేస్తున్న సంస్థకు లీగల్‌ నోటీసు ఇచ్చినట్లు స్పష్టం చేశారు. బస్‌ స్టేషన్లలో స్టిక్కర్లు, కరపత్రాలు అంటించే వారిపై, బస్సుల్లో, బయట పాన్‌, గుట్కా ఉమ్మేసే వారిపైనా కేసులు నమోదు చేస్తున్నామని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బలపడుతున్న ఉపరితల ఆవర్తనం : తెలంగాణాలో మళ్లీ కుండపోతవర్షాలు

ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం - సునామీ హెచ్చరికలు

ఏపీ గ్రామీణ స్థానిక సంస్థల కోసం కేంద్ర ప్రభుత్వం రూ.410.76 కోట్లు

AP: ఏపీలో రాజ్‌భవన్‌ నిర్మాణానికి సీఆర్డీఏ ఆమోదం

అయోధ్యలో భారీ పేలుడు.. భవనం కూలి ఐదుగురు దుర్మరణం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదం పాలు తాగుతున్నారా?

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

తర్వాతి కథనం
Show comments