Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల వైకుంఠపురంలో కొత్త రికార్డ్.. టీఆర్పీ రేటింగ్ అదిరిపోయిందిగా..!

Webdunia
గురువారం, 27 ఆగస్టు 2020 (12:50 IST)
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన చిత్రం అల వైకుంఠపురంలో. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించగా,  సుశాంత్‌, టబు ప్రధాన పాత్రల కనిపించారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందించారు. నాన్ బాహుబలి చిత్రంగా అనేక రికార్డులు క్రియేట్ చేసిన అల వైకుంఠపురములో చిత్రం గత వారం ప్రముఖ ఛానెల్‌లో ప్రసారం చేయబడింది. 
 
ఈ చిత్రానికి రికార్డ్ స్థాయిలో 29.4 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. తెలుగు చిత్రాలలో ఇప్పటివరకు ఇదే అత్యధికం అంటున్నారు. లాక్‌డౌన్ వలన ప్రజలందరు ఇళ్లకే పరిమితం కావడంతో ఈ సినిమాని చాలామంది వీక్షించినట్టు తెలుస్తుంది. కాగా, సినిమాలోని ప్రతి సాంగ్ కూడా దేశ వ్యాప్తంగానే కాక విదేశీ ప్రేక్షకులని కూడా ఎంతగానో ఆకట్టుకుంది.
 
ఇదిలా ఉంటే.. అల వైకుంఠపురములో అంటూ సంక్రాంతికి ప్రేక్షకులకు ముందుకు వచ్చిన ఈ సినిమా రికార్డుల పంట పండిస్తోంది. నిత్యం ఏదో ఒక విషయంలో రికార్డులు సెట్ చేస్తూ దూసుకెళ్తోంది. తాజాగా ఈ సినిమా మరో సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. తాజాగా అల వైకుంఠపురములో చిత్ర ఆల్బమ్ వంద కోట్ల వ్యూస్ సాధించి యూట్యూబ్‌లో సరికొత్త రికార్డ్ సృష్టించిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments