Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాహుబలి బాటలో పుష్ప.. కేజీఎఫ్-2తో పోటీ పడతాడా?

Webdunia
బుధవారం, 4 ఆగస్టు 2021 (11:23 IST)
బాహుబలి రెండు భాగాలు మంచి సక్సెస్ సాధించాయి. అయితే, ఇప్పుడు ఇదే బాటలో మరికొన్ని చిత్రాలు రూపుదిద్దుకుంటున్నాయి. అందులో ఒకటి పుష్ప. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా చేస్తున్న ఈ సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేయాలని యూనిట్ నిర్ణయం తీసుకుంది. మొదటి భాగం ఈ ఏడాది డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా రాబోతుంది. అంతేకాదు, దేశంలో పెద్ద హిట్‌గా నిలిచిన కేజీఎఫ్ సీక్వెల్ కేజీఎఫ్‌-2తో పోటీ పడుతుంది. 
 
ఇక పుష్ప రెండో భాగాన్ని వచ్చే ఏడాది సమ్మర్‌లో రిలీజ్ చేయాలని యూనిట్ నిర్ణయం తీసుకుంది. ఇందులో బన్నీ ఎర్రచందనం స్మగ్లర్‌గా కనిపిస్తుండగా, రష్మిక మంధన గిరిజన యువతిగా నటిస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో చిత్రీకరిస్తున్నారు. పుష్ప కూడా రెండు భాగాల్లో హిట్టయితే, మరికొన్ని చిత్రాలు కూడా అదే బాటలో నడవడం ఖాయమని చెప్పాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జస్టిస్ ఘోష్ కమిషన్‌ ముందుకు మాజీ సీఎం కేసీఆర్.. అరెస్టు తప్పదా?

ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కవిత.. తండ్రిని చూసి భావోద్వేగం.. కాళేశ్వరం విచారణకు కేసీఆర్

వరకట్నంగా కిడ్నీ అడిగిన అత్తమామలు... నిరాకరించిన కోడలిపై దాడి...

శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్రకు మరోమారు బ్రేక్...

మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసు : ఆ ఒక్క తప్పుతో ప్లాన్ మొత్తం మటాష్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments