Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేన్సర్‌ బాధితులతో అల్లు అర్జున్‌...

Webdunia
బుధవారం, 1 జులై 2015 (19:43 IST)
కేన్సర్‌తో బాధపడుతున్న నలుగురు చిన్నారులను సినీ హీరో అల్లు అర్జున్‌ పరామర్శించారు. మేక్‌ ఎ విష్‌ ఫౌండేషన్‌ ద్వారా చిన్నారుల పరిస్థితి తెలుసుకున్న అల్లు అర్జున్‌ వారిని కలుసుని వారిని ఉత్సాహపరుస్తూ ఉల్లాసంగా గడిపారు. చిన్నారుల పరిస్థితిని వైద్యులను, వారి తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చిన్నారులకు గిప్ట్‌లు అందజేశారు. 
 
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ చివరిదశలో ఉన్న చిన్నారుల కోరిక తీర్చడం గొప్ప విషయమని అన్నారు. ఈ దశలో పిల్లలకు సాయం చేయడం కంటే మనోధైర్యం ఇవ్వడమే ముఖ్యమన్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్న మేక్‌ ఎ విస్‌ సంస్థకూ అందరూ చేయూతనివ్వాలని పిలుపునిచ్చారు. ఈ ఆర్గనైజేషన్‌ తరపున పిలుపు వస్తే ఏ సెలబ్రెటి అయినా వెంటనే స్పందించాలని విజ్ఞప్తి చేశారు.
 
పిల్లలను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నీ మనం డబ్బుతో కొనలేమని అన్నారు. మేక్‌ ఎ విష్‌ ఫౌండేషన్‌  ఏర్పాటు చేసిన బైసైకిల్స్‌ను కొందరికి అల్లు అర్జున్‌ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా మేక్‌ ఎ విష్‌ ఫౌండేషన్‌  స్ఫూర్తిని ఆయన అభినందించారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments