కొత్త దర్శకులను ప్రోత్సహించేందుకే వీ4 బ్యానెర్ : అల్లు అరవింద్

కొత్త ఆలోచనలతో వచ్చే యువ దర్శకులను ప్రోత్సహించేందుకే వీ4 బ్యానర్‌ను స్థాపించినట్టు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ వెల్లడించారు. ఈ బ్యానర్‌లో ఆది సాయికుమార్, వైభవి, రష్మీ గౌతమ్ జంటగా 'నెక్స్ట్ నువ్వే' అన

Webdunia
మంగళవారం, 19 సెప్టెంబరు 2017 (15:48 IST)
కొత్త ఆలోచనలతో వచ్చే యువ దర్శకులను ప్రోత్సహించేందుకే వీ4 బ్యానర్‌ను స్థాపించినట్టు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ వెల్లడించారు. ఈ బ్యానర్‌లో ఆది సాయికుమార్, వైభవి, రష్మీ గౌతమ్ జంటగా 'నెక్స్ట్ నువ్వే' అనే చిత్రాన్ని నిర్మించారు. ఇది ఈ బ్యానర్‌లో ఇదే మొదటి చిత్రం. 
 
ఈ కొత్త బ్యానర్ గురించి నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ, యువ దర్శకులను ప్రోత్సహించడమే ఈ బ్యానర్ ఉద్దేశమన్నారు. కొత్తగా ఆలోచించేవారికి ఆహ్వానం పలుకుతుందని చెప్పారు. కొత్త దర్శకులతో కొత్త ఆలోచనలను పంచుకుంటూ నిర్మాతగా వాళ్లతో కలిసి ప్రయాణించడానికే ఈ బ్యానర్‌ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. యువ దర్శకులు కొత్త ఆలోచనలతో ముందుకువస్తే, వారిని ప్రోత్సహించడం కోసం ఈ బ్యానర్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. 
 
కాగా, టాలీవుడ్‌లోని అగ్ర నిర్మాతల్లో అల్లు అరవింద్ ఒకరు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై ఆయన ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు. ఇటీవలే గీతా ఆర్ట్స్ 2 అనే బ్యానర్‌ను కూడా ఏర్పాటు చేసి వరుస సినిమాలు చేస్తూ వెళుతున్నారు. ఈ నేపథ్యంలోనే బన్నీ వాసు .. జ్ఞానవేల్ రాజా.. యూవీ క్రియేషన్స్‌తో కలిసి 'వి4 క్రియేషన్స్' అనే పేరుతో మరో బ్యానర్ ను ఏర్పాటు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జూబ్లీ హిల్స్ బైపోల్.. హస్తం హవా.. కారుకు బ్రేక్

Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ఫలితాలు.. కేసీఆర్ ఏమన్నారంటే?

25 ఏళ్ల జానపద గాయని మైథిలీ ఠాకూర్ చేతిలో ఓడిపోతున్న ఉద్ధండ నాయకుడు బినోద్ మిశ్రా

పరకామణి చోరీ కేసు : ఫిర్యాదు చేసిన ఏవీఎస్వో అనుమానాస్పద మృతి

గ్యాంగ్ రేప్ చేసి బయటే తిరుగుతున్నాడు.. యువతి ఆవేదన (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

తర్వాతి కథనం
Show comments